logo

మూర్ఛతో బురదలో చిక్కుకొని.. ఊపిరాడక యువరైతు మృతి

పొలం పనులు చేస్తుండగా మూర్ఛ రావడంతో ఒక్కసారిగా బురదలో కూరుకుపోయి ఊపిరాడక ఓ యువరైతు మృతి చెందిన ఘటన మండలంలోని తుక్కాపూర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..

Published : 22 Jan 2022 02:36 IST

 

కొల్చారం, న్యూస్‌టుడే: పొలం పనులు చేస్తుండగా మూర్ఛ రావడంతో ఒక్కసారిగా బురదలో కూరుకుపోయి ఊపిరాడక ఓ యువరైతు మృతి చెందిన ఘటన మండలంలోని తుక్కాపూర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తుక్కాపూర్‌కు గ్రామానికి చెందిన బాయికాడి కృష్ణ (28) తమకున్న అరెకరాన్ని నాట్లు వేసేందుకు సిద్ధం చేస్తున్నాడు. శుక్రవారం తండ్రి రాములుతో కలిసి పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో కృష్ణకు మూర్ఛ రాగా కింద పడిపోయాడు. బురదలలో పడిపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకొని రోదించగా, అక్కడున్న వారిని కలచివేసింది. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని