logo

శతాధిక వృద్ధురాలి మృతి

చినభీమవరంలో శతాధిక వృద్ధురాలు కాలపురెడ్డి రాములమ్మ (105) శుక్రవారం మృతి చెందారు. ఆమెకు ఆరుగురు సంతానం. వీరిలో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న

Updated : 22 Jan 2022 02:15 IST

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: చినభీమవరంలో శతాధిక వృద్ధురాలు కాలపురెడ్డి రాములమ్మ (105) శుక్రవారం మృతి చెందారు. ఆమెకు ఆరుగురు సంతానం. వీరిలో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారులు ఇద్దరూ చనిపోయారు. మునిమనవలకూ వివాహాలై సంతానం ఉన్నారు. ఆమె ఇప్పటివరకు ఆరోగ్యంగానే ఉంటూ తన పనులన్నింటినీ తాను చక్కగా చేసుకునేదని కుటుంబసభ్యులు తెలిపారు. బాధిత కుటుంబసభ్యులను జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, పలువురు నాయకులు పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని