ఖాళీ కడుపులు.. చెవికెక్కని పాఠాలు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదని నిర్వాహకులు నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పొయ్యి వెలిగించేదిలేదని జిల్లా విద్యాశాఖకు నోటీసులు అందించారు.
పాఠశాలల్లో నిలిచిన మధ్యాహ్న భోజనం
పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదని నిర్వాహకులు నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పొయ్యి వెలిగించేదిలేదని జిల్లా విద్యాశాఖకు నోటీసులు అందించారు. గడచిన ఆరు రోజులుగా పాఠశాలలో పొయ్యి వెలగడంలేదు. దీంతో విద్యార్థులు ఆర్ధాకలితో పాఠాలు వింటున్నారు. విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ వంట పాత్రల సమస్య ఎదురైంది. ఫలితంగా విద్యార్థులు ఇంటినుంచే భోజనాన్ని తెచ్చుకుంటున్నారు. సోమవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో ‘న్యూస్టుడే’ పరిశీలించింది. స్థానిక విద్యార్థులు ఇంటికి వెళుతుండగా దూర ప్రాంత విద్యార్థులు ఖాళీ కడుపుతోనే పాఠాలు వినే పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే బోధనపై ప్రభావం చూపనుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమకు గౌరవ వేతనాన్ని రూ.11,700కు పెంచాలని, ప్రతి పాఠశాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ.6 వరకు పలుకుతుండగా రూ.4 చెల్లించడంతో ఆర్థిక భారం పడుతుందని...ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని, వంట పాత్రలు కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమ్మె ప్రకటించారు.
పాఠశాలల్లో వెలగని పొయ్యి
జిల్లాలో 358 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత, 101 ఉన్నత, 7 ఆదర్శ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. రోజువారిగా సుమారు 35 వేలకు పైగా విద్యార్థులు భోజనాన్ని తింటున్నారు. మార్కెట్లో రోజు రోజుకూ విపరీతంగా కూరగాయల ధరలు పెరగడంతో నష్టాలు చవిచూస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. నిర్వాహకులు వంట గదికి తాళంవేడయంతో పాత్రలు అందుబాటులో లేవని ప్రత్యామ్నాయ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.
ఇంటి నుంచే భోజనం
పెద్దపల్లి మండలం అప్పన్నపేట జడ్పీ పాఠశాలకు బంధంపల్లి, అందుగులపల్లి, దేవునిపల్లి, క్రషర్నగర్, బ్రహ్మణపల్లి, రాగినేడు, కనగర్తి, కాసులపల్లి, భొంపెల్లి గ్రామాల నుంచి వస్తున్నారు. ఇక్కడ 260 మంది విద్యార్థులు చదువుతున్నారు. వంట చేయకపోవడంతో ఇంటినుంచే తీసుకొస్తున్నారు. స్థానిక విద్యార్థులు ఇళ్లలోకి వెళ్లి భోజనం చేసి వస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
- మాధవి, జిల్లా విద్యాధికారి
నిర్వాహకుల సమ్మె విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించాం. వంటపాత్రల సమస్య ఉంది. కొందరు పిల్లలు ఇంటినుంచి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సారూ.. ఇంటికెళ్లొస్తాం
పాఠశాలలో ఇంటికి పంపించమని ప్రాధేయపడుతున్న చిన్నారులు
మంథని గ్రామీణం, న్యూస్టుడే: మంథని బాలికల పాఠశాలలో మంథని, ముత్తారం మండలాల్లో పది గ్రామాల నుంచి ప్రవేశాలు తీసుకుంటున్నారు. 320 మంది చదువుతుండగా ఎక్కువ మంది దూరప్రాంతాల వారే ఉన్నారు. మధ్యాహ్నం వేళలో భోజనాన్ని తీసుకురాలేదని, ఇంటికి పంపించమని విద్యార్థులు ఉపాధ్యాయున్ని ప్రాథేయపడుతున్నారు. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ఇంటికి పంపిస్తామని ఉపాధ్యాయులు అంగీకరించడంలేదు.
ఇంటి బువ్వే దిక్కు
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వంట మనుషులకు ప్రభుత్వం నుంచి సరైన బిల్లులు మంజూరు కాకపోవడంతో సమ్మె బాట పట్టారు. దీంతో రామగుండం నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకుండా పోయింది. దీంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇంటి వద్ద నుంచే మధ్యాహ్న భోజనం వెంట తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. గోదావరిఖని ప్రభుత్వ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం పాఠశాలకు 336 మంది హాజరయ్యారు. అందరూ టిఫిన్ బాక్సులో అన్నం వెంట తీసుకుని ఇలా ఒకే చోట కూర్చొని తింటున్నారు.
-న్యూస్టుడే, మార్కండేయకాలనీ
అంతా అయోమయం
సుల్తానాబాద్లో భోజనాన్ని వడ్డిస్తున్న ప్రత్యామ్నాయ నిర్వాహకులు
సుల్తానాబాద్, న్యూస్టుడే: సుల్తానాబాద్ ఉన్నత పాఠశాలలో సమీప గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకుంటున్నారు. గత మూడు రోజులుగా వంట నిర్వాహకులు సమ్మె చేయడంతో పాఠశాలల్లో అసలు భోజనం పెడతారో లేదోనని విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. పాఠశాలల్లో భోజనం వండేవారు కరవయ్యారు. విద్యార్థులే ఇంటినుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. సదుపాయం లేనివారు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా