తెరచుకోని వంట గదులు
ప్రభుత్వ బడుల్లో చదువుతోపాటు పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలన్నదే సర్కారు లక్ష్యం. కరోనా తర్వాత సెప్టెంబర్ నుంచి బడులు పునఃప్రారంభించారు. మధ్యాహ్నం భోజనం పెట్టె వంట నిర్వాహకులు నెలల తరబడి బిల్లులు, వేతనాలు
ముస్తాబాద్ ప్రాథమిక పాఠశాల వంటగదికి తాళం పొగచూరని పొయ్యి దృశ్యం
ముస్తాబాద్, న్యూస్టుడే: ప్రభుత్వ బడుల్లో చదువుతోపాటు పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలన్నదే సర్కారు లక్ష్యం. కరోనా తర్వాత సెప్టెంబర్ నుంచి బడులు పునఃప్రారంభించారు. మధ్యాహ్నం భోజనం పెట్టె వంట నిర్వాహకులు నెలల తరబడి బిల్లులు, వేతనాలు రావడలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ వండుతున్నామన్నారు. నెలల తరబడి వంట బిల్లులు, వేతనాలు రాక మేం ఎలా వంటలు చేస్తామంటూ ఇక మా వల్ల కాదంటూ వంటలు మాని సమ్మెకు దిగారు. పాఠశాల వంట గదులకు తాళం వేశారు. పొయ్యిలు పొగ చూరడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేక ఇళ్ల నుంచి మధ్యాహ్న భోజనం బాక్సులు తెచ్చుకొని తింటున్నారు. పనికి తగ్గ పారితోషికం, ప్రభుత్వమే కోడిగుడ్లు, కూరగాయలు, గ్యాస్ సరఫరా చేయాలంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వంటలు చేయబోమని వంటలు మానివేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిపి వేసిన వైనంపై ప్రత్యేక కథనం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు-339, ప్రాథమికోన్నత-37, జడ్పీ పాఠశాలలు-1,11, ప్రభుత్వ పాఠశాలలు 02 ఉన్నాయి. మొత్తం కలిపి 489 పాఠశాలు ఉండగా 45,910 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 810 మంది మధ్యాహ్న భోజన వంట నిర్వాహకురాళ్లు పనిచేస్తున్నారు. ముస్తాబాద్ మండలంలో ప్రాథమిక-30, ప్రాథమికోన్నత-04, జడ్పీ పాఠశాలలు-10, ఆదర్శ పాఠశాల-1 ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 3,750 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో కలిపి 75 మంది వంట నిర్వాహకురాళ్లు మధ్యాహ్న భోజనం వంటలు చేస్తున్నారు. వంట నిర్వాహకులకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వంట బిల్లులు, సెప్టెంబర్, అక్టోబర్ వేతనాలు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం ఒక్కో కోడిగుడ్డుకు రూ.4 మాత్రమే చెల్లిస్తుంది. రూ.5 నుంచి 6 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. అలాగే ప్రాథమిక పాఠశాల ఒక్కో విద్యార్థికి రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఒక్కో విద్యార్థికి రూ. 7.45 మాత్రమే చెల్లిస్తుంది. నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. వంట నిర్వాహకులకు నెలకు రూ.1,000 మాత్రమే. అరకొర వేతనంతో పనిచేస్తున్నామంటూ వంట నిర్వాహకులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటలు నిలిపి వేశారు. దీంతో కొంత ఇబ్బందులకు గురవుతున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా వంట నిర్వాహకుల సమస్యలను పరిష్కరించి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటలు తిరిగి ప్రారంభించేలా సంబంధిత అధికారులు, ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మధ్యాహ్న భోజనం లేకుంటే ఇబ్బందే
-ఎస్కే సిమ్రాన్, 10వ తరగతి గూడూరు
మాది గూడూరు గ్రామం. నేను ముస్తాబాద్ జడ్పీ సక్సెస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం నుంచి నిత్యం పాఠశాలకు బస్సులో వస్తుంటాను ఉదయం 8 గంటల వరకు బస్టాండ్కు రావాలి. లేదంటే బస్సు వెళ్లిపోతుంది. మా ఇంటి నుంచి మధ్యాహ్న భోజనం బాక్సు తీసుకురావాలంటే ఇంటి పనులతో ఆలస్యమవుతుంది. అసలే నేను 10 తరగతి. నాలాంటి విద్యార్థులు ఎంతోమంది ఇతర గ్రామాల నుంచి పాఠశాలకు వస్తుంటారు. వంట నిర్వాహకుల సమ్మె ఇలాగే రోజుల తరబడి కొనసాగితే అటు బస్సు, ఇటు తరగతులను కోల్పోవాల్సి వస్తుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం లేకుంటే సాయంత్ర వరకు పస్తులుండాల్సిందే.
సమస్యలు పరిష్కరించేంత వరకు వంటలు చేయం
-గొట్టె సంతోష, వంట నిర్వహకురాళ్ల జిల్లా ప్రధాన కార్యదర్శి
పనికి తగ్గ పారితోషికం అందించాలి, ప్రభుత్వమే అంగన్వాడీ తరహాలో కోడిగుడ్లు వంట సరకులు, గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలి. వంట పాత్రలు అందించాలి. పనికి భద్రత కల్పించాలి, ఉపాధ్యాయుల వేధింపులు, రాజకీయ వేధింపులు ఉండరాదు. మా సమస్యలు పరిష్కరిస్తేనే తిరిగి వంటలను ప్రారంభిస్తాం.
వేతనాల బిల్లులు ట్రెజరీలో సమర్పించాం
-బన్నాజి ఇన్ఛార్జి ఎంఈవో
మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులకు సంబంధించిన బడ్జెట్ విడుదలైంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మెస్ బిల్లులు, 1వ నుంచి 8వ తరగతి వరకు సెప్టెంబర్, అక్టోబర్ వంట నిర్వాహకుల వేతనాలకు సంబంధించిన బిల్లులను ట్రెజరీలో సమర్పించాం. ట్రెజరీ నుంచి వంట నిర్వాహకుల వారీగా వారి వారి ఖాతాల్లో డబ్బులు చేరతాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వంటలు తిరిగి ప్రారంభించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం