logo

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

అంతర్గాం మండలం కుందనపల్లి రైల్వేగేట్‌ సమీపాన రైలు కిందపడి గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ రాజీవ్‌నగర్‌కు చెందిన బల్ల వెంకటేష్‌(26) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు పట్టాలకు కొద్ది దూరంలో తన స్కూటీ వాహనాన్ని నిలిపాడు.

Published : 07 Dec 2021 06:15 IST


వెంకటేష్‌

రామగుండం, న్యూస్‌టుడే : అంతర్గాం మండలం కుందనపల్లి రైల్వేగేట్‌ సమీపాన రైలు కిందపడి గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ రాజీవ్‌నగర్‌కు చెందిన బల్ల వెంకటేష్‌(26) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు పట్టాలకు కొద్ది దూరంలో తన స్కూటీ వాహనాన్ని నిలిపాడు. సాయంత్రం పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన రైల్వే కీమెన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం మానేసి కొంతకాలంగా యైటింక్లయిన్‌కాలనీలో ఉంటున్నాడు. వెంకటేష్‌ అవివాహితుడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు రామగుండం జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌ఛార్జి జి.తిరుపతి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని