లక్ష్యం కోసం ఇదేం పద్ధతి?
కరోనా విజృంభణ కేవలం టీకాలతోనే అడ్డుకోగలుగుతామని వైద్యశాఖ సూచిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరికి రెండు మోతాదుల్లో పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లు వైద్యశాఖను ఆదేశించారు. అయితే టీకాల పంపిణీ చేపట్టకుండానే లక్ష్యాన్ని పూర్తి
టీకా వేసుకున్నట్లు తప్పుడు సంక్షిప్త సందేశాలతో గందరగోళం
ఈటీవీ, కరీంనగర్: కరోనా విజృంభణ కేవలం టీకాలతోనే అడ్డుకోగలుగుతామని వైద్యశాఖ సూచిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరికి రెండు మోతాదుల్లో పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లు వైద్యశాఖను ఆదేశించారు. అయితే టీకాల పంపిణీ చేపట్టకుండానే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో కేవలం మొదటి టీకా తీసుకున్న వారికి గడువు పూర్తి కాగానే రెండో మోతాదు టీకా తీసుకున్నట్లు సంక్షిప్త సందేశాలు వస్తుండటంతో గందరగోళం నెలకొంది. తాము టీకా తీసుకోలేదని సంక్షిప్త సందేశం పంపిన వారికి ఫోన్ చేయడంతో పర్వాలేదు ఇప్పుడు వచ్చి తీసుకొమ్మని సలహా ఇస్తుండటం సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విరివిగా టీకాల పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు పట్టణాలు గ్రామాల వారీగా విభజించి దిశానిర్దేశం చేశారు. ఇదే అదనుగా లక్ష్యానికి అనుగుణంగా టీకాల పంపిణీ జరగక పోవడంతో ఆయా టీకా కేంద్రాల్లోని సిబ్బంది ఓటర్ లిస్టు ప్రకారం రెండో మోతాదు కూడా ఇచ్చేశామని సంక్షిప్త సందేశాలు పంపించి చేతులు దులుపుకొంటున్నారు. తమకు సందేశం రావడంతోటే సమీపంలోని టీకా కేంద్రానికి వెళ్లి టీకాల గురించి ఆరా తీస్తుండటంతో అసలు వ్యవహారం వెలుగులోకి వస్తోంది.
ఓటర్ జాబితాతో రెండో మోతాదు నమోదు
కరోనా టీకాకోసం ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో రావాలని వైద్యశాఖ ప్రకటించింది. అయితే చాలా వరకు ప్రజలు ఆధార్ కార్డు ఆధారంగా టీకాల నమోదుకు వెళుతున్నారు. రెండో మోతాదు విషయంలో మాత్రం ఓటరు జాబితా ముందు పెట్టుకొని నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఏదైనా కేంద్రానికి ఎన్ని టీకా వాయిల్స్ సరఫరా చేస్తున్నారో..ఆ లెక్కలన్నీ సాయంత్రానికి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో టీకా ఇవ్వకపోయినా ఆన్లైన్లో తీసుకున్నట్లు నమోదు చేస్తే ఆ టీకాలకు సంబంధించిన వాయిల్స్ ఏ లెక్కలో చూపుతున్నారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది.
టీకా తీసుకోక ముందే సందేశం
కిరణ్కుమార్,హౌజింగ్ బోర్డు కాలనీ
హౌజింగ్ బోర్డు కాలనీలోని టీకా కేంద్రంలో జులై7న కొవాగ్జిన్ మొదటి టీకా తీసుకున్నాను. ఆ తర్వాత రెండో మోతాదు తీసుకోవాల్సి ఉండగా ఎక్కడ తిరిగినా కొవాగ్జిన్ టీకా దొరకలేదు. నవంబర్ 11న రెండో డోసు తీసుకున్నారు. మీకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందంటూ సందేశం రావడంతో షాక్కు గురయ్యాను. వాస్తవానికి అప్పటికి నేను ఇంకా రెండో టీకా కోసం తిరుగుతున్నా వ్యాక్సిన్ మాత్రం వేయించుకోలేదు.
రెండో టీకా తీసుకోక ముందే వ్యాక్సిన్ సర్టిఫికెట్
కె.మౌనిక.,కరీంనగర్
ఆర్టీసీ డిస్పెన్సరీ టీకా కేంద్రంలో ఆగస్టు 23న మొదటి టీకా తీసుకున్నాను.రెండో మోతాదు టీకా తీసుకోవాల్సి ఉండగా డిసంబర్ మొదటి తేదీ రెండో టీకా తీసుకున్నట్లు సంక్షిప్త సందేశం వచ్చింది. సమీపంలోని టీకా కేంద్రానికి వెళ్లితే ఇప్పటికే రెండు టీకాలు పూర్తి అయ్యాయని సమాధానం ఇచ్చారు. తనకు సందేశం పంపించిన నంబర్కు ఫోన్ చేస్తే పర్వాలేదు..ఇప్పుడు వచ్చి తీసుకోవచ్చని సమాధానం చెప్పారు. నాలాగే చాలా మందికి ఇలాంటి సందేశం వచ్చిందని ఫిర్యాదు చేస్తున్నారు.
పొరపాటుగా సందేశాలు వచ్చి ఉంటాయి
డాక్టర్ జువేరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కరీంనగర్
ఇలాంటి సందేశాలు వస్తే సమీపంలోని టీకా కేంద్రానికి వెళ్లి సరిచేసుకోవాలి. టీకా ఇవ్వక పోయినా ఆన్లైన్లో నమోదు చేయడం తప్పు అలా చేస్తే చర్యలు తప్పవు. కొన్నిసార్లు ఒకే ఫోన్ నంబర్ను కుటుంబంలోని వారంతా నమోదు చేయిస్తే అలా జరిగి ఉండవచ్ఛు లేదా సమాచార లోపం వల్ల జరిగే అవకాశం ఉంది. లక్ష్యం పూర్తి చేసేందుకు ఇలాంటి చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)