logo

ఎమ్మెల్యే ఈటలకు నోటీసులు

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కరీంనగర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల వెలువడిన తరువాత నవంబరు 2వ తేదీన ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడమే కాకుండా,

Published : 07 Dec 2021 05:58 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కరీంనగర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల వెలువడిన తరువాత నవంబరు 2వ తేదీన ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడమే కాకుండా, కరోనా నిబంధనలు పట్టించుకోలేదని పేర్కొంటూ కరీంనగర్‌ మూడో ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఠాణాకు హాజరు కావాలని పేర్కొంటూ కరీంనగర్‌ మూడో ఠాణా పోలీసులు సోమవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ దామోదర్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని