కుమారుడి కిరాతకం
కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, మల్కపల్లి గ్రామానికి చెందిన కొండా రమేశ్, పాపమ్మ(45) దంపతులు. బతుకు దెరువుకు కొనేళ్లక్రితం నగరానికి వచ్చారు.
అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు డంబెల్స్తో దాడి
తల్లి మృతి.. అడ్డొచ్చిన సోదరికి గాయాలు
పాపమ్మ, సుధీర్కుమార్
సుల్తాన్బజార్, న్యూస్టుడే: కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, మల్కపల్లి గ్రామానికి చెందిన కొండా రమేశ్, పాపమ్మ(45) దంపతులు. బతుకు దెరువుకు కొనేళ్లక్రితం నగరానికి వచ్చారు. అనారోగ్యంతో 8 ఏళ్ల క్రితం రమేశ్ మృతి చెందగా.. పాపమ్మ, కుమారుడు సుధీర్కుమార్(24), కూతురు (25) రెండేళ్లుగా రాంకోఠిలో ఉంటున్నారు. డిగ్రీ చదివిన సుధీర్కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. మానసికస్థితి సరిగ్గా లేక ఏడాదిగా ఇంటివద్దే ఉంటున్న కుమారుడికి తల్లి చికిత్స చేయిస్తున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురూ నిద్రకు ఉపక్రమించారు. సుధీర్ తెల్లవారు జాము 2 గంటల సమయంలో లేచి వ్యాయామం చేస్తుండగా, ఇప్పుడు చేయడమేంటని తల్లి వారించింది. విచక్షణ కోల్పోయిన సుధీర్ చేతిలోని డంబెల్స్తో తల్లి తలపై కొట్టాడు. పాపమ్మ అక్కడికక్కడే కుప్పకూలారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సోదరిపై కూడా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని కారు అద్దాన్ని ధ్వంసం చేశాడు. సుచిత్ర కేకలతో ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకుని సుధీర్, గాయపడ్డ అతడి సోదరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నగర పోలీసు సంయుక్త కమిషనర్(తూర్పు మండలం) రమేశ్, సుల్తాన్బజార్ ఏసీపీ, ఇన్స్పెక్టర్ భిక్షపతి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇన్స్పెక్టర్ భిక్షపతి పర్యవేక్షణలో ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం పాపమ్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. వైద్యుల సూచనలు, న్యాయమూర్తి (మెజిస్ట్రేట్) ఆదేశాలతో సుధీర్ను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం