ఎమ్మెల్సీ కవిత పేరుతో రూ.6లక్షలు టోకరా!
ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పి ఇద్దరు యువకులు ఓ వ్యక్తికి టోకరా వేశారు. మొత్తం రూ.6.5 లక్షలు దోచేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణానికి చెందిన మహేశ్ గౌడ్, వినోద్ అనే యువకులు కవిత పేరుతో న్యూస్ ఛానల్ పెడుతున్నామని మహ్మద్ అలియాస్ స్వామిని నమ్మించారు..
ఈనాడు డిజిటల్, కామారెడ్డి: ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పి ఇద్దరు యువకులు ఓ వ్యక్తికి టోకరా వేశారు. మొత్తం రూ.6.5 లక్షలు దోచేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణానికి చెందిన మహేశ్ గౌడ్, వినోద్ అనే యువకులు కవిత పేరుతో న్యూస్ ఛానల్ పెడుతున్నామని మహ్మద్ అలియాస్ స్వామిని నమ్మించారు. మొదట అతని నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఛానెల్ ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి వేరే ఛానల్లో కెమెరామెన్గా అవకాశం కల్పిస్తామని మరో రూ.50 వేలు తీసుకొని ఐడీ కార్డు ఇచ్చారు. ఆపై కవితతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్పి రెండు పడక గదుల ఇంటి కోసం మరో రూ.4 లక్షలు తీసుకున్నారు. నెలలు గడిచినా ఇల్లు, ఛానల్ ఏర్పాటు చేయకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వమనడంతో మరో వారం ఆగాలని కోరారు. దీంతో వీరిద్దరి మోసాన్ని గ్రహించిన బాధితుడు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితుడికి ఫిర్యాదు మేరకు నిందితులు మహేశ్ గౌడ్, వినోద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ