Karnataka: మాట వినలేదని మద్యం దుకాణంపై మహిళల కన్నెర్ర..!

వద్దని వ్యతిరేకించినా మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై కర్ణాటకలోని ముస్లాపూర్‌లో స్ధానిక మహిళలు కన్నెర్ర చేశారు. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని...

Published : 15 Nov 2021 01:27 IST

బెంగళూరు: వద్దని వ్యతిరేకించినా మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై కర్ణాటకలోని ముస్లాపూర్‌లో స్ధానిక మహిళలు కన్నెర్ర చేశారు. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ధ్వంసం చేశారు. ముస్లాపూర్ గ్రామంలో మద్యం దుకాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించగా.. మహిళలు వ్యతిరేకిస్తూ ఇటీవల నిరసన తెలిపారు.  అయినా రెండు రోజుల క్రితం దుకాణాన్ని ప్రారంభించారు. మద్యం దుకాణాన్ని మూసివేయాల్సిందిగా 50 మంది మహిళలు యజమానికి మొదట విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన మహిళలు మద్యం దుకాణంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని