Crime News: రేణిగుంటలో దారుణం:భర్తను నరికి.. అతడి తలతో పీఎస్‌కు వెళ్లిన భార్య

చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది.

Published : 21 Jan 2022 01:44 IST

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పోలీసులైను వీధిలో నివాసం ఉండే రవి చంద్రన్‌ (53), వసుంధర భార్యాభర్తలు. వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర.. తన భర్తపై కత్తితో అతికిరాతకంగా దాడి చేసి తల నరికేసింది. అనంతరం ఆ తలను సంచిలో తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. 

ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన పోలీసులు నిందితురాలిని వెంటపెట్టుకొని ఘటనాస్థలికి వెళ్లారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని