Viral Video: కత్తులతో బెదిరించి చోరీ.. ఛేజ్ చేసి పట్టుకున్న వేలూరు ఎస్పీ!
చోరీ చేసి పారిపోతున్న దొంగలను జిల్లా ఎస్పీనే స్వయంగా ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ‘సింగం’ సినిమాను తలపించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వెల్లూరు: చోరీ చేసి పారిపోతున్న దొంగలను జిల్లా ఎస్పీనే స్వయంగా ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ‘సింగం’ సినిమాను తలపించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పల్లికొండకు చెందిన సతీశ్ వెల్లూరు గ్రీన్ సర్కిల్ వద్ద టాటూ వ్యాపారం చేస్తుంటాడు. సాళవన్ ప్రాంతానికి చెందిన కిషోర్, అతడి ఇద్దరి స్నేహితులు కత్తులతో బెదిరించి సతీశ్ వద్ద ఉన్న సొమ్మును కాజేశారు. అనంతరం బైక్పై పరారయ్యారు. అదే సమయంలో అటుగా వాహనంలో వెళ్తున్న జిల్లా ఎస్పీ సెల్వకుమార్ కంట పడ్డారు.
నిందితులను చూసిన ఎస్పీ వారి వాహనాన్ని అడ్డగించాలని డ్రైవర్ను ఆదేశించాడు. అయితే పోలీసు వాహనాన్ని చూసిన నిందితులు వేగంగా వెళ్లే క్రమంలో అదుపు తప్పి బోల్తాపడ్డారు. ఒకడు బైక్ మీద ఉడాయించగా.. ఇద్దరు నిందితులు పరుగందుకున్నారు. ఎస్పీనే స్వయంగా వెంబడించి నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 1,200 నగదు, సెల్ఫోన్, కత్తి, కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వెల్లూరు నార్త్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పించుకున్న మరో నిందితుడిని ఘటన జరిగిన గంటలోపే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్పీతో సహా పోలీసు సిబ్బందిని ప్రజలు అభినందించారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM