uttar pradesh: సామూహిక అత్యాచారం కేసు.. యూపీ మాజీ మంత్రికి జీవితఖైదు

అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత గాయత్రి ప్రజాపతికి లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు జీవితఖైదు విధించింది. అతడితోపాటు మరో ఇద్దరికి కూడా జీవితఖైదు.. రూ. 2లక్షలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2017లో తనపై.. తన మైనర్‌ కుమార్తెపై గాయత్రి ప్రజాపతి, అతని అనుచరులు అత్యాచారం

Updated : 12 Nov 2021 20:31 IST

లఖ్‌నవూ: సామూహిక అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత గాయత్రి ప్రజాపతికి లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు జీవితఖైదు విధించింది. అతడితోపాటు మరో ఇద్దరికి కూడా జీవితఖైదు.. రూ. 2లక్షలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2017లో తనపై.. తన మైనర్‌ కుమార్తెపై గాయత్రి ప్రజాపతి, అతని అనుచరులు అత్యాచారం చేశారంటూ చిత్రకూట్‌కి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అదే ఏడాది ఫిబ్రవరిలో గాయత్రి ప్రజాపతితోపాటు మరో ఆరుగురిపై సామూహిక అత్యాచారం, బెదిరింపులు తదితర సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మార్చిలో ప్రజాపతిని అరెస్ట్‌ చేశారు. కాగా.. విచారణలో ఏడుగురు నిందితుల్లో నలుగురిని కోర్టు నిర్దోషులుగా తేల్చడంతో కేసు నుంచి బయటపడ్డారు. కాగా.. ప్రజాపతి, అతడి ఇద్దరు అనుచరులు అశోక్‌ తివారి, ఆశిష్‌ శుక్లా దోషులుగా తేలడంతో వారికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని