Crime News: జగిత్యాలలో దారుణం.. తండ్రి, ఇద్దరు కుమారుల హత్య

జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామనగర్‌లో తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు హత్య చేశారు.

Updated : 20 Jan 2022 16:19 IST

జగిత్యాల: జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామనగర్‌లో తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్థులు హత్య చేశారు. కుల సంఘం సమావేశం జరుగుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మంత్రాల నెపంతో ఈ ముగ్గురిని హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ రూపేష్‌కుమార్‌, డీఎస్పీ ప్రకాశ్‌, సీఐ కృష్ణకుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని