TS News: అంత్యక్రియలకు వెళ్తూ.. మృత్యు ఒడికి..

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఒకే కుటుంబానికి

Updated : 03 Dec 2021 16:40 IST

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

రఘునాథపల్లి: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందడం విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ప్రాంతం చందానగర్‌లో పాపిరెడ్డి కాలనీకి చెందిన శేఖర్‌ రెడ్డి (65), ధనమ్మ(60) దంపతులు తమ కుమారుడు రఘుమారెడ్డి (27)తో కలిసి ఘనపురంలోని తిరుమలగిరిలో మృతి చెందిన బంధువుల అంత్యక్రియలకు శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు. ఈ క్రమంలో వనపర్తి సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బొలేరో వాహనం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని