Crime: దొంగలు పడ్డారు..అయితే డబ్బుకోసం కాదు..
సాధారణంగా దొంగలు పడి డబ్బు, నగలు దోచుకెళ్తారు. కానీ, ముంబయిలో విచిత్ర ఘటన జరిగింది. ఓ హోటల్లో దొంగలు పడి కొన్ఇన వందల కిలోల బరువున్న భారీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. అందుకోసం పెద్ద సొరంగం తవ్వడం గమనార్హం.
ముంబయి: సాధారణంగా దొంగలు పడి డబ్బు, నగలు దోచుకెళ్తారు. కానీ, ముంబయిలో విచిత్ర ఘటన జరిగింది. ఓ హోటల్లో దొంగలు పడి కొన్ని వందల కిలోల బరువున్న భారీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. అందుకోసం పెద్ద సొరంగం తవ్వడం గమనార్హం.
అరే ప్రాంతంలోని ఇంపీరియల్ ప్యాలెస్ అనే హోటల్కు వెనుకవైపు నుంచి దొంగలు కొన్ని రోజులపాటు కష్టపడి సొరంగాన్ని తవ్వారు. అనంతరం హోటల్లోకి ప్రవేశించి.. అక్కడున్న పది అడుగుల భారీ సైనిక విగ్రహాన్ని చోరీ చేశారు. ఆ విగ్రహాన్ని ఇటలీలో తయారు చేశారట. దీని ధర దాదాపు.. రూ.7లక్షలు ఉంటుందని అంచనా. కొన్ని రోజుల కిందట.. హోటల్ సిబ్బంది ఆ విగ్రహం కనిపించట్లేదని అరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హోటల్ వెనుకవైపు ఉన్న అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టగా విగ్రహానికి సంబంధించిన 300కిలోలకుపైగా బరువున్న పలు భాగాలు లభించాయి. దర్యాప్తును ముమ్మరం చేయగా.. ఇది పావై పథాక్ అనే విగ్రహాల దొంగల గ్యాంగ్ చేసిన పనిగా గుర్తించారు. ఆ గ్యాంగ్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా విడదీసి అరే అటవీ ప్రాంతంలో దాచిపెట్టి.. కొన్నాళ్ల తర్వాత విక్రయించాలని దొంగలు భావించారట. అలా దొంగలు విగ్రహపు భాగాలను కుర్లాలో విక్రయించే ప్రయత్నం చేస్తుండగా.. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్లో హోటల్ మూతపడగా.. చిన్న చిన్న కాంస్య విగ్రహాలు, విలువైన వస్తువులు కూడా చోరీకి గురయ్యాయని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. కానీ, ఈ సారి భారీ విగ్రహం చోరీకి గురికావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి