burglary: భలే దొంగ.. చోరీ కోసమే 5 కిలోల బరువు తగ్గాడు!
బరువు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం కొందరు.. అందం కోసం కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి కేవలం తన పాత యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే 5 కిలోల బరువు తగ్గాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. అతడు దొంగతనం
అహ్మదాబాద్: బరువు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం కొందరు.. అందం కోసం కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి కేవలం తన పాత యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే 5 కిలోల బరువు తగ్గాడు. పక్కా ప్రణాళికతో రూ.లక్షలు చోరీచేసి పరారైనా.. చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని ఉదయ్పుర్కి చెందిన మోతీ సింగ్ చౌహన్.. గుజరాత్లోని అహ్మదాబాద్లో మోహిత్ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో సహాయకుడిగా పని చేసి.. మూడేళ్ల కిందట మానేశాడు. అయితే, మోహిత్ ఇంట్లో భారీగా నగదు, నగలు ఉండటం గమనించిన మోతీ సింగ్ ఎలాగైనా ఆ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పని చేస్తున్న సమయంలోనే ఇంట, బయట సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఏ చోట నుంచి ఇంట్లోకి చొరబడే అవకాశాలున్నాయనే విషయాలను గమనించాడు. చివరికి ఓ గాజు కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తే.. సీసీకెమెరాలో కనిపించదని తెలుసుకున్నాడు. కానీ, అతడు కాస్త లావుగా ఉండటంతో ఆ సన్నటి కిటికీ గుండా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా ఆ కిటికీలో నుంచి దూరి దొంగతనం చేయాలని భావించిన మోతీ.. మూడు నెలలపాటు రోజుకు ఒక్కపూటే ఆహారం తింటూ 5 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత తన పాత యజమాని ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పాల్పడ్డాడు. మొత్తం రూ.13.14లక్షలు విలువ చేసే నగదు, నగలు ఎత్తుకెళ్లాడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మోతీ సింగ్ను గాలించడం మొదలుపెట్టారు. అయితే, గాజు కిటికీని పగలగొట్టానికి ఉపయోగించిన పరికరాన్ని మోతీ సింగ్ ఘటనాస్థలిలోనే వదిలేయడంతో దాని ఆధారంగా చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ పరికరం కొనుగోలు చేసిన దుకాణంలో మోతీ సింగ్ వివరాలు లభించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కేవలం దొంగతనం చేయడం కోసమే నిందితుడు మూడు నెలలపాటు కఠిన ఆహార నియమాలు పాటించి 5 కిలోల బరువు తగ్గాడని పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM