Crime News: పులివెందుల.. ప్రియుడి చేతిలో వివాహిత దారుణహత్య

ప్రియుడి చేతిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన కడప జిల్లా పులివెందుల పట్టణంలో

Updated : 01 Dec 2021 14:02 IST

పులివెందుల గ్రామీణం: ప్రియుడి చేతిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన కడప జిల్లా పులివెందుల పట్టణంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ఎన్‌కే కాలువకు చెందిన రిజ్వాన (26)కు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన సర్దార్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరు పులివెందులలో నివాసం ఉంటున్నారు. మూడు నెలల క్రితం రిజ్వాన ఎన్‌కే కాలువకు చెందిన మాజీ ప్రియుడు హర్షవర్ధన్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు రిజ్వాన కోసం గాలింపు చేపట్టగా బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. దీంతో వారు అక్కడికి వెళ్లి రిజ్వానను సింహాద్రిపురానికి తీసుకొచ్చి పెద్దల సమక్షంలో పంచాయతీ చేశారు.

అప్పటి నుంచి రిజ్వాన భర్త, పిల్లలతో కలిసి పులివెందులలోనే ఉంటోంది. ఈ క్రమంలో బాధితురాలు అద్దెకు ఉంటున్న ఇంటి కింద దుకాణంలో యజమానితో మాట్లాడుతుండగా హర్షవర్ధన్‌ అక్కడికి చేరుకొని కత్తితో దారుణంగా పొడిచాడు. ఈ ఘటనతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు హర్షవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు