Road Accident: డివైడర్ను ఢీకొని బైకును ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని కాసింతల క్షేత్ర సమీపంలో 40వ జాతీయ రహదారిపై కారు.. బైకును ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఆళ్లగడ్డ గ్రామీణం: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని కాసింతల క్షేత్ర సమీపంలో 40వ జాతీయ రహదారిపై కారు.. బైకును ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నుంచి కడప వైపు వెళ్తున్న కారు ఆళ్లగడ్డ సమీపంలోకి రాగానే టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ మరోవైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న శిరివెళ్లకు చెందిన అఫ్జల్, కలాం, జావెద్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే బైక్పై ఉన్న మరో వ్యక్తి సులేమాన్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రాజేంద్ర ఘటనాస్థలికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.