Road Accident: డివైడర్‌ను ఢీకొని బైకును ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని కాసింతల క్షేత్ర సమీపంలో 40వ జాతీయ రహదారిపై కారు.. బైకును ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.

Updated : 19 Oct 2021 15:07 IST

ఆళ్లగడ్డ గ్రామీణం: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని కాసింతల క్షేత్ర సమీపంలో 40వ జాతీయ రహదారిపై కారు.. బైకును ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నుంచి కడప వైపు వెళ్తున్న కారు ఆళ్లగడ్డ సమీపంలోకి రాగానే టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ మరోవైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న శిరివెళ్లకు చెందిన అఫ్జల్‌, కలాం, జావెద్‌ అక్కడికక్కడే మృతి చెందారు. అదే బైక్‌పై ఉన్న మరో వ్యక్తి సులేమాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రాజేంద్ర ఘటనాస్థలికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని