ఏవోబీలో ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు.. వీరిలో అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు?

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు కీలక మావోయిస్టులను విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated : 12 Aug 2021 15:04 IST

విశాఖ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు కీలక మావోయిస్టులను విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల అరెస్టుపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీడియా సమావేశం నిర్వహించిన వివరాలను వెల్లడించనున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని