Crime News: కరెంటు షాకిచ్చి చిన్నారిని హతమార్చిన కసాయి తండ్రి
సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఘర్షణపడి 11 నెలల చిన్నారిని విద్యుత్ షాక్ పెట్టి హతమార్చిన
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఘర్షణపడి 11 నెలల చిన్నారిని విద్యుత్ షాక్ పెట్టి హతమార్చిన ఘటన స్థానికులను కలచివేసింది. వెంకట్రావుపేటకు చెందిన మిరుదొడ్డి రాజశేఖర్.. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సునీతను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంత కాలం కాపురం సజావుగానే సాగింది. 11 నెలల క్రితం పాప జన్మించిన తర్వాత సునీత, రాజశేఖర్ తరచూ గొడవపడేవారు. ఈక్రమంలో ఇరు గ్రామాలకు చెందిన పెద్దలు పలు మార్లు పంచాయితీ పెట్టి కలిసుండాలని నచ్చజెప్పారు.
సునీత, అత్తమామలకు మధ్య గొడవకు దారితీసే అవకాశం ఉంటే వేరు కాపురం పెట్టాలని పెద్దలు సూచించారు. ఈనేపథ్యంలో వేరు కాపురం పెడతామని సునీత కోరగా.. రాజశేఖర్ నిరాకరించడంతో గొడవలు మళ్లీ మొదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి గొడవ జరగడంతో భార్య సునీతను కొట్టి పాపను వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి విద్యుత్ షాకిచ్చి చంపేశాడు. పాప మృతి చెందిన తర్వాత రాజశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. హుటాహుటిన అతడిని కుటుంబ సభ్యులు గజ్వే్ల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!