సెలైన్ స్టాండ్తో వైద్యుడిపై కరోనా రోగి దాడి
కరోనా నుంచి మన ప్రాణాల్ని రక్షించుకొనేందుకు మాస్కు ధరించడమే శ్రీరామ రక్ష అంటూ వైద్యులు, పలు రంగాల ప్రముఖులు పదేపదే హెచ్చరిస్తున్నా కొంతమందిలో......
ముంబయి: కరోనా నుంచి మన ప్రాణాల్ని రక్షించుకొనేందుకు మాస్కు ధరించడమే శ్రీరామరక్ష అంటూ వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నా కొంతమందిలో ఇంకా మార్పు రావడంలేదు. ఒకవేళ ఎవరైనా మాస్క్ తీయొద్దని చెబితే కోపంతో వారిపైనే దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ మాస్కు తీయొద్దని చెప్పినందుకు కరోనా రోగి సెలైన్ స్టాండ్తో ఓ వైద్యుడిపై దాడి చేయడం కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన వైద్యుడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయగఢ్ జిల్లా అలీబాగ్ ప్రభుత్వ ఆస్పత్రిలోని బుధవారం ఉదయం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. కరోనా బారినపడిన ఓ వ్యక్తి గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం విధుల్లో ఉన్న స్వప్నదీప్ తాలే అనే వైద్యుడు రౌండ్స్కు వచ్చిన సమయంలో ఆక్సిజన్ మాస్కును పదే పదే తీయొద్దంటూ రోగికి సూచించారు. వైద్యుడి సూచనలతో రోగి కోపానికి గురైన నిందితుడు కుర్చీలో కూర్చున్న వైద్యుడిపై వెనుక నుంచి వచ్చి సెలైన్ స్టాండ్తో తలపై గట్టిగా కొట్టాడు. వైద్యుడికి గాయాలు కావడంతో అదే ఆస్పత్రిలో చేర్పించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.