crime news: నిజామాబాద్లో కిడ్నాపైన మూడేళ్ల చిన్నారి క్షేమం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఓ షాపింగ్మాల్ వద్ద అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఓ షాపింగ్మాల్ వద్ద అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలి వెళ్లారు. పాపను గుర్తించిన పోలీసులు నిజామాబాద్ తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.
కిడ్నాప్ జరిగిందిలా..
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన నూరేన్ తన తల్లి, మూడేళ్ల కూతురు అస్కియా హనీతో కలిసి ఉదయం నిజామాబాద్ నగరానికి వస్త్రాల కొనుగోలు కోసం వచ్చారు. కుటుంబీకులు షాపింగ్ ముగించుకొని బిల్లు చెల్లిస్తున్న సమయంలో చిన్నారి అస్కియా మాయమైంది. తన కూతురు కనిపించకపోవడంతో తల్లి షాపింగ్మాల్ సిబ్బందికి తెలపగా అంతటా వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఓ మహిళ బుర్ఖాలో వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్తున్నట్లు దృశ్యాలు కనిపించాయి. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చేపట్టారు. చిన్నారి అదృశ్యమైన రెండ్రోజుల తర్వాత కూడా ఆచూకీ లభించలేదు. ఈ కేసులో నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని జల్లెడ పట్టారు. అయినా చిన్నారికి సంబంధించిన ఒక్క ఆధారమూ దొరకలేదు. చివరికి ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీవెడ్డింగ్ ఫంక్షన్లో వివాదం..యువకుడిని టెర్రస్పై నుంచి తోసేసిన వ్యాపారవేత్త
ఓ ప్రీవెడ్డింగ్ వేడుకలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తికి ప్రాణాంతకంగా మారింది. -
బాలుడిని చంపేసి.. ఆత్మహత్య చేసుకుని..!
చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
హైదరాబాద్లో అమానుషం.. మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళ.. తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. కన్నూమిన్నూ కానకుండా వారు ఆమెపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
అమెరికాలో శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. -
పవన్ సభలో చాకుతో యువకుడు
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్లో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. రాజస్థాన్లో 9 మంది మృతి
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా కేస్కుతుల్-కేశముండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం ఓ మావోయిస్టు నేత మృతి చెందాడు. -
వార్డు సచివాలయంలో పట్టుబడ్డ మద్యం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వార్డు సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. -
చంద్రబాబు సభకు వెళ్లారని హత్యాయత్నం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడనే అక్కసుతో తెదేపా కార్యకర్తపై వైకాపా మద్దతుదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్