Crime News: ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి
ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ప్రేమించమంటూ వేధించి యువతి గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఘటన రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం జరిగింది. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం
గొంతు కోసి హతమార్చిన యువకుడు
మృతురాలు అంజలి, నిందితుడు రాజు
గోదావరిఖని-యైటింక్లైన్కాలనీ, న్యూస్టుడే: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ప్రేమించమంటూ వేధించి యువతి గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఘటన రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం జరిగింది. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం యైటింక్లైన్కాలనీ కేకేనగర్కు చెందిన గొడుగు అంజలి(20) తండ్రి ఆమె చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి లక్ష్మి కూలీ పని చేస్తూ కుమార్తెని పోషిస్తోంది. తల్లి పనికి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన చాట్ల రాజు (20) అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలుపెట్టాడు. విషయం లక్ష్మికి తెలియడంతో రాజును ఇంటికి రావద్దని హెచ్చరించింది. ఏడాది కిందట పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఈమధ్య అంజలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలుసుకున్న రాజు ఫోన్చేసి వేధించడం మొదలుపెట్టాడు. ఆమె నుంచి స్పందన రాకపోవడంతో పగ పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అంజలి ఇంటికి వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. కేకలు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి, అక్కడే ఉన్న కత్తిపీటతో దాడి చేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. లక్ష్మితో కలిసి కూలీ పని చేసే వ్యక్తి ఒకరు ఉపాధిహామీ జాబ్కార్డు ఇచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం వారి ఇంటికి వచ్చాడు. ఎంత పిలిచినా ఎవరూ పలకకపోవడం, టీవీ సౌండ్ పెద్దగా వినిపిస్తుండటంతో లోపలికి వెళ్లిన అతడికి రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ గిరిప్రసాద్, సీఐ శ్రీనివాసరావు పరిశీలించి, విచారణ ప్రారంభించారు. నిందితుడు రాజు అంజలిని హత్య చేసిన అనంతరం పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
బంగారంలో పెట్టుబడి అంటూ రూ.6.12 కోట్లు మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. -
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?