విద్యుదాఘాతం: ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
విద్యుదాఘాతం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కరెంట్ షాక్కు గురై ఒకే కుటుంబంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లా...
భోపాల్: విద్యుదాఘాతం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కరెంట్ షాక్కు గురై ఒకే కుటుంబంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా బిజావర్లో ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఇవాళ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహువాఝాలా గ్రామంలో జగన్ అహిర్వార్ కుటుంబం ఓ సెప్టిక్ ట్యాంకును నిర్మిస్తోంది. పని చేసేటప్పుడు వెలుతురు కోసం అందులో ఓ విద్యుత్ బల్బును ఉంచారు. పనంతా పూర్తయిపోవడంతో నిర్మాణ వ్యర్థాలను బయటకు తీసేందుకు జగన్ ఆహివార్ కుమారుడు అందులోకి దిగి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని రక్షించేందుకు వెళ్లిన ఆరుగురు కుటుంబ సభ్యులు షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు. మృతులను నరేంద్ర (20), రామ్ ప్రసాద్ (30), విజయ్ (20), లక్ష్మణ్ (55), శంకర్ అహిర్వార్ (35),మిలాన్ (25)గా గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు