Road Accident: కిడ్నాప్‌ అయిన బాలికను రక్షించేందుకు వెళ్తూ.. అయిదుగురి దుర్మరణం

అపహరణకు గురైన బాలికను రక్షించేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులతోసహా అయిదుగురు మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మథురాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌...

Published : 03 Dec 2021 16:12 IST

లఖ్‌నవూ: అపహరణకు గురైన బాలికను రక్షించేందుకు వెళ్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులతోసహా అయిదుగురు మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మథురాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ తికమ్‌గఢ్ జిల్లాలోని బుదేరా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు సిబ్బంది.. స్థానికంగా కిడ్నాప్‌ అయిన ఓ బాలికను రక్షించేందుకు హరియాణాలోని బహదుర్‌గఢ్‌కు ఎస్‌యూవీలో బయల్దేరారు. బాలికను కాపాడేందుకు సాయంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని తీసుకెళ్లారు.

మార్గమధ్యంలో మథుర వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టినట్లు తికమ్‌గఢ్ అదనపు ఎస్పీ ఎంఎల్‌ చౌరాసియా తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో హెడ్ కానిస్టేబుల్ భవానీ ప్రసాద్(52), కానిస్టేబుళ్లు హీరాదేవి ప్రజాపతి(32), కమలేంద్ర యాదవ్(28)తోపాటు వారికి సాయంగా వెళ్తున్న ప్రీతి, ధర్మేంద్ర కూడా మృతిచెందినట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఇదే ఘటనలో హెడ్ కానిస్టేబుల్‌తోపాటు డ్రైవర్‌, మరొకరికి గాయాలైనట్లు చెప్పారు. ఈ ముగ్గురిని వెంటనే మథురలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని