Aryan khan: ఆర్యన్కు బెయిల్ కోసం తప్పని నిరీక్షణ.. వాదనలు నేటికి వాయిదా
మాదకద్రవ్యాల కేసులో బెయిల్ కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఆర్యన్తో పాటు ......
ముంబయి: మాదకద్రవ్యాల కేసులో బెయిల్ కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్యన్తో పాటు అర్బాజ్ మర్చెంట్, మూన్మూన్ ధమేచా దాఖలు చేసిన బెయిలు పిటిషన్పై వరుసగా రెండో రోజూ సుదీర్ఘ వాదనలు కొనసాగినా ఎవరికీ బెయిల్ రాలేదు. ఈ కేసులో వాదనలను గురువారం వింటామని వెల్లడించిన బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కేసు విచారణను కొనసాగిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎన్డబ్ల్యూ సాంబ్రే వెల్లడించారు. మరోవైపు, ఎన్సీబీ తరఫున ఏఎస్సీ అనిల్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. నిందితుల తరఫున ముకుల్ రోహత్గీ, అమిత్ దేశాయ్, అలీ కాశీఫ్ ఖాన్ దేశ్ముఖ్ వాదనలు ముగించగా.. ఇంకా ఎన్సీబీ తరఫు న్యాయవాది వాదనలు వినాల్సి ఉంది. అయితే, ఇందుకు మరింత సమయం పట్టడంతో విచారణను రేపు పూర్తి చేసేందుకు ప్రయత్నిద్దామన్న జడ్జి.. ఈ కేసు తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేశారు.
మూన్మూన్ని బలిపశువుని చేశారు..
ఆర్యన్ఖాన్ తరఫున రెండో రోజు కూడా మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న అర్బాజ్ మర్చెంట్ తరఫున అమిత్ దేశాయ్, మూన్మూన్ ధమేచా తరఫున అలీ కాశీఫ్ ఖాన్ దేశ్ముఖ్ వాదించారు. ఈ కేసులో నిందితులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ముంబయి క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు ఇచ్చిన అరెస్టు మెమోలో అరెస్టుకు సరైన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని ముకుల్ రోహత్గీ తెలిపారు. ఆర్యన్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్సీబీ కుట్ర సిద్ధాంతానికి బలం చేకూర్చేలా వాట్సాప్ చాట్లు లేవని అర్బాజ్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. నిందితులు ముంబయిలోనే ఉన్నందున ఎన్సీబీ విచారణకు ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటారని చెప్పారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసులో మూన్మూన్ ధమేచాని బలిపశువుని చేశారని ఆమె తరఫు న్యాయవాది అలీ కాశీఫ్ ఖాన్ దేశ్ముఖ్ అన్నారు. ఆమె గదిలోకి వెళ్లిన రెండు-మూడు నిమిషాల్లోనే అరెస్టు చేశారని తెలిపారు. ఆమెతో పాటు సౌమ్య సింగ్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..