Maoist Sharadakka: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క
మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు
హైదరాబాద్: మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. 1994లో దళంలో చేరిన ఆమె అప్పటి కమాండర్ హరిభూషణ్ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ప్లాటూన్ కమాండర్గా, సెంట్రల్ కమిటీ కమాండర్గానూ శారదక్క పని చేశారు. 2006లో జరిగిన ఎన్కౌంటర్లో బుల్లెట్ తగిలి ఒక కన్ను కోల్పోయారు. 2007లో ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఆమె, 2011లో మరోసారి హరిభూషణ్తో కలిసి మావోయిస్ట్ పార్టీలో చేరారు. హరిభూషణ్ బతికి ఉన్నన్ని రోజులు శారదక్కకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉండేది. అతని మరణం తర్వాత మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆమె అనాసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో దళాన్ని వీడాలని నిర్ణయించుకుని, తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత ఆరు నెలల్లో 20 మంది మావోయిస్టులు మావోయిస్ట్ పార్టీని వీడి జన జీవన స్రవంతిలో కలిసినట్లు శారద చెప్పారు. హింస ద్వారా ఏమీ సాధించలేమని, మిగతా మావోయిస్టులు కూడా లొంగి పోవాలని పోలీసుల ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణా మావోయిస్ట్ రాష్ట్ర కమిటీలో 115 మంది ఉన్నారు. వీళ్లలో తెలంగాణకు చెందిన వాళ్లు కేవలం 15 మంది. మిగతా వాళ్లంతా గోతికోయలే. కేంద్ర కమిటీ సభ్యులైన ఆజాద్, రాజీరెడ్డి లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు అడ్డుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడే మావోయిస్టులందరూ లొంగిపోండి. శారద జనజీవన స్రవంతిలోకి వచ్చినందుకు 5 లక్షల రివార్డ్తో పాటు తాత్కాలిక సాయంగా రూ.5 వేల నగదు ఇస్తున్నాము’’ అని అన్నారు.
మరోవైపు మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. చాలా మంది మావోయిస్టులకు కరోనా సోకింది. అడవుల్లో సరైన వైద్య సదుపాయాలు అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దామోదర్ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ నుంచి మావోయిస్ట్ దళంలోకి నూతనంగా ఎవరూ చేరడం లేదు. కేంద్ర కమిటీలో 25 మంది ఉన్నారు. వారిలో 11 మంది తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. మిగతా 11 మంది ఇతర రాష్ట్రాల వాళ్లు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.