Crime News: పశువుల పండుగలో విషాదం: పొట్టేలును బలివ్వబోయి వ్యక్తి నరికివేత

పశువుల పండుగలో విషాదం చోటుచేసుకుంది. ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో పొట్టేలును బలిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు.

Updated : 17 Jan 2022 06:16 IST

చిత్తూరు: పశువుల పండుగలో విషాదం చోటుచేసుకుంది. ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో పొట్టేలును బలిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు.  మద్యం మత్తులో పొట్టెలును బదులు వ్యక్తి ప్రాణాన్ని తీశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని వలసపల్లెలో జరిగింది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలివ్వడానికి గ్రామస్థులు సిద్ధమయ్యారు.  ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలును పట్టుకున్న సురేష్‌(35)ను నరికాడు. దీంతో అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని