Crime: చికెన్‌ ఫ్రై వండలేదని భార్యని చంపేశాడు

అతడి క్షణికావేశం ఆమె పాలిట శాపమైంది. కేవలం చికెన్‌ ఫ్రై వండిపెట్టలేదనే కారణంతో..  దారుణంగా భార్యను చంపేశాడా భర్త. వివరాల్లోకి వెళ్లితే.. బెంగళూరులో ముబారక్ పాషా(30), షిరిన్ బాను అనే దంపతులు నివాసముంటున్నారు.

Published : 25 Aug 2021 01:29 IST

బెంగళూరు: అతడి క్షణికావేశం ఆమె పాలిట శాపమైంది. కేవలం చికెన్‌ ఫ్రై వండిపెట్టలేదనే కారణంతో..  దారుణంగా భార్యను చంపేశాడా భర్త. వివరాల్లోకి వెళ్లితే.. బెంగళూరులో ముబారక్ పాషా(30), షిరిన్ బాను అనే దంపతులు నివాసముంటున్నారు. కొన్నిరోజులుగా తమ కుమార్తె కనిపించకుండా పోయిందని మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు షిరిన్‌ తల్లితండ్రులు. విచారణలో భాగంగా పోలీసులు షిరిన్ భర్త ముబారక్‌ను ప్రశ్నిస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కాగా సోమవారం నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయి.. నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ‘‘ అవును నేనే ఇదంతా చేశాను. ఆగస్టు18న రాత్రి.. నేను ఇంటికి వచ్చేసరికి చికెన్‌ ఫ్రై  చేసిపెట్టమన్నాను. తీరా ఇంటికి వచ్చేసరికి చూస్తే వండలేదు. కోపం వచ్చింది. ఎందుకిలా చేసావని అడిగితే అహంభావంతో సమాధానం ఇచ్చింది. వెంటనే నాలోఆగ్రహావేశాలు కట్టలుతెంచుకున్నాయి. తలపై కట్టెతో కొట్టేశా. దగ్గరికెళ్లి చూస్తే చనిపోయినట్లు కనిపించింది. అదే సమయంలో పిల్లలు పడుకున్నారు. శవాన్ని గోనిసంచిలో పెట్టి.. అర్ధరాత్రి నా బైక్‌మీద తీసుకెళ్లి చిక్కబనవర సరస్సులో పడేసి వచ్చా’’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ముబారక్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని