Crime: నా గర్ల్ఫ్రెండ్కి ఇంగ్లిష్ రాదు.. అందుకే మారువేషంలో పరీక్ష రాస్తున్నా
ప్రేమలో పడి చదువుని నిర్లక్ష్యం చేసిన వాళ్లని చూసుంటారు.పరీక్షలు ఎగ్గొట్టి తిరిగిన జంటల గురించి వినే ఉంటారు. మరి ప్రేమ ‘మారువేష’ పరీక్ష గురించి విన్నారా ఎప్పుడైనా.. తన గర్ల్ఫ్రెండ్ కోసం అమ్మాయి మారువేషం వేసుకొని పరీక్ష హాల్లో అడ్డంగా దొరికిపోయాడో ఓ యువకుడు. చివరికి ఇద్దరూ కటకటాలపాలై ఊసలు లెక్కపెడుతున్నారు. ఇదంతా ఈశాన్య ఆఫ్రికా దేశంలోని డైయోర్బెల్ అనే పట్టణంలో తాజాగా జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రేమలో పడి చదువుని నిర్లక్ష్యం చేసిన వాళ్లని చూసుంటారు.పరీక్షలు ఎగ్గొట్టి తిరిగిన జంటల గురించి వినే ఉంటారు. మరి ప్రేమ ‘మారువేష’ పరీక్ష గురించి విన్నారా ఎప్పుడైనా.. తన గర్ల్ఫ్రెండ్ కోసం అమ్మాయి మారువేషం వేసుకొని పరీక్ష హాల్లో అడ్డంగా దొరికిపోయాడో ఓ యువకుడు. చివరికి ఇద్దరూ కటకటాలపాలై ఊచలు లెక్కపెడుతున్నారు. ఇదంతా సెనెగల్లోని డైయోర్బెల్ అనే పట్టణంలో తాజాగా జరిగింది. విషయానికొస్తే.. అతడి పేరు ఖాదీం(22).. తన గర్ల్ఫ్రెండ్ గంగూ(19)కి హై స్కూల్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంగ్లిష్లో అంతగా పట్టులేని గంగూ ఎలాగైనా పరీక్షల్లో పాస్ కావాలని తన బాయ్ఫ్రెండ్ను తనలా రెడీ చేసింది. ఇందుకు పొడువైన జట్టున్న విగ్, చెవిరింగులు, మేకప్, డ్రెస్తో పాటు ముఖాన్ని కప్పిపుచ్చేందుకు తలపై సంప్రదాయ స్కార్ఫ్తో రెడీ చేసింది. గంగూ చెప్పిన విధానాన్ని అలానే అనుసరిస్తూ.. మూడు రోజులు ఎవరికి అనుమానం రాకుండా.. ఎవరి కంటా పడకుండా.. అందరినీ మాయచేస్తూ వచ్చాడు ఖాదీం. ఇలా మూడు రోజుల వరకూ వారి ఆటలు సాఫీగానే సాగాయి. ఇక నాలుగో రోజు పరీక్ష అప్పుడు పరీక్ష హాల్కి వచ్చిన ఇన్విజిలేటర్కి ఖాదీం కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే అతడి గురించి పై అధికారులకు సమాచారమిచ్చారు. ఆపై వారు పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వెంటనే పరీక్ష హాల్కు చేరుకొని ముందుగా ఖాదీంను డీటైన్ చేశారు. తరువాత ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేయగా.. తాను ఇలా చేయడానికి కారణం తన గర్ల్ఫ్రెండ్ అని, ఆమెకు ఇంగ్లిష్ రాకపోవడంతో ఎలాగైనా తను పరీక్షల్లో పాస్ చేయాలనే ఉద్దేశంతో ఆమె చెప్పినట్టు చేశానని తప్పుని ఒప్పుకున్నాడు ఖాదీం. అనంతరం ఉన్నతాధికారులు వారిని రెండేళ్ల పాటు ఎటువంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. న్యాయస్థానం ఇద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?