వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
మీరు కోటీశ్వర్లు అయ్యారు. మేం తీసిన లాటరీలో మీకు బంపర్ ఆఫర్ వచ్చింది. అక్షరాలా రూ.కోటి గెలుచుకున్నారు
కుమారులు ఎంత వేడుకున్నా నిర్ణయం మార్చుకోలేదు
వీడియోకాల్ చేసి ఉరివేసుకున్న తండ్రి
రామారెడ్డి: ‘‘మీరు కోటీశ్వర్లు అయ్యారు. మేం తీసిన లాటరీలో మీకు బంపర్ ఆఫర్ వచ్చింది. అక్షరాలా రూ.కోటి గెలుచుకున్నారు. ఆ నగదు మీ వద్దకు చేరాలంటే సర్వీస్ ఛార్జీలు చెల్లించాలి’’ ఇదీ నయా మోసగాళ్లు ప్రస్తుతం అనుసరిస్తున్న ట్రెండ్. సరిగ్గా ఇటువంటి మోసమే ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చనిపోతున్నానంటూ కన్న కుమారులకు వీడియో కాల్ చేసి ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో అంతులేని వేదనను మిగిల్చింది. ‘వద్దు నాన్నా.. వద్దు’ అంటూ చిన్నారులు విలపిస్తూ ఎంత వేడుకున్నా ఆ తండ్రి నిర్ణయాన్ని మార్చుకోలేదు. వీడియోకాల్లో మాట్లాడుతూనే తనువు చాలించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం పోసానిపేట్కు చెందిన మంగళపల్లి లక్ష్మణ్ (35) కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసముంటున్నాడు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న లక్ష్మణ్కు ఆరు నెలల క్రితం ‘కరోడ్పతి’ అయ్యారంటూ మొబైల్కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మీరు రూ.కోటి గెలుచుకున్నారు.. ముందుగా కొంత డబ్బు చెల్లిస్తే గెలుచుకున్న మొత్తం మీ ఇంటికి చేరుతుంది’ అని చెప్పడంతో లక్ష్మణ్ అప్పు చేసి మరీ ఆన్లైన్లో రూ.2.65 లక్షలు చెల్లించాడు. మరో గొలుసుకట్టు సంస్థకూ రూ.2 లక్షలకు పైగా కట్టాడు. తీరా డబ్బు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గురువారం స్వగ్రామం పోసానిపేట్కు వెళ్లి చనిపోతున్నానంటూ కామారెడ్డిలో ఉన్న కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశాడు. ఆ సమయంలో తన ఇద్దరు కుమారులు వద్దని ఎంత చెబుతున్నా.. వినకుండా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామారెడ్డి ఎస్సై రాజు తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’