AP News: నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. 

Updated : 25 Jan 2022 10:06 IST

నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్నారనే అనుమానంతో ముఠా కారును ట్రాఫిక్‌ ఎస్సై, పోలీసులు గుర్తించి వారిని వెంబడించారు. తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా కారు ఓ ఆటోని ఢీకొట్టింది. అనంతరం పోలీసులు వెంబడిస్తుండటంతో కొంతదూరం వెళ్లాక కారును విడిచిపెట్టేశారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు సమీపంలోని పెదబొడ్డేపల్లి పెద్ద చెరువులో దూకేయగా.. మరో నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు చెరువును చుట్టుముట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టడంతో అతడు చిక్కాడు. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల కారులో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు