Crime News: నడిరోడ్డుపై మహిళకు దారుణ అవమానం.. కేజ్రీవాల్ ఫైర్..!
గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య ఉన్న శత్రుత్వం.. నడిరోడ్డుపై ఒక మహిళను దారుణంగా అవమానించేలా చేసింది.
దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య ఉన్న శత్రుత్వం.. నడిరోడ్డుపై ఒక మహిళను దారుణంగా అవమానించేలా చేసింది. ఆమెపై సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. నిందితులకు అంతధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు.
ఒక మహిళ జుత్తు కత్తిరించి, ముఖమంతా నలుపు రంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి వివేక్ విహార్ ప్రాంతంలో రోడ్డుపై ఊరేగిస్తోన్న వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది. అప్పుడు పక్కనే ఉన్న పలువురు మహిళలు ఈ ఘటనను అడ్డుకోక పోగా.. కేరింతలు కొట్టడం కనిపించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు వివాహిత. ఆమె ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఒక బాలుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అందుకు ఈ మహిళే కారణమని బాలుడి తరఫు బంధువులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలను దిల్లీ మహిళా కమిషన్ ట్విటర్లో షేర్ చేసింది. అక్రమ మద్యం విక్రయదారులు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా కమిషన్ ఛైర్మన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని, విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.
ఇది సిగ్గుచేటు చర్య: ‘ఈ ఘటన సిగ్గుచేటు చర్య. ఇలా ప్రవర్తించేందుకు వారికి అంతధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ను అభ్యర్థిస్తున్నాను. అలాంటి దురాగతాలను, ఈ తరహా చర్యలకు పాల్పడేవారిని దిల్లీ వాసులు ఏ మాత్రం సహించరు’ అని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?