Uttar Pradesh: యూపీలోని కారాగారంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్విన ఖైదీలు
ఉత్తర్ప్రదేశ్ ఫరూకాబాద్లోని ఫతేహ్గఢ్ జిల్లా కారాగారంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ఖైదీ మృతితో ఆగ్రహం చెందిన మిగతావారు అధికారులపై రాళ్లు రువ్వుతూ ఆందోళనకు దిగారు. జైలు ప్రాంగణంలోని కొత భాగానికి నిప్పంటించారు. మొత్తం ప్రాంగణాన్ని...
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ ఫరూకాబాద్లోని ఫతేహ్గఢ్ జిల్లా కారాగారంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ఖైదీ మృతితో ఆగ్రహం చెందిన మిగతా ఖైదీలు అధికారులపై రాళ్లు రువ్వుతూ ఆందోళనకు దిగారు. జైలు ప్రాంగణంలోని కొంత భాగానికి నిప్పంటించారు. మొత్తం ప్రాంగణాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ జైలర్లు అఖిలేష్ కుమార్, శైలేష్ కుమార్ను బందీలుగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో ఓ సిబ్బందికి, ఖైదీకి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. పలువురు స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు. అంతకుముందు ఖైదీలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించినా.. ఫలితం లేకపోయిందని వివరించారు.
‘ఆలస్యంగా చికిత్స అందించడంతోనే..’
అనారోగ్యంతో ఉన్న సందీప్ కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందడంతో.. ఖైదీలు ఆగ్రహంతో ఉన్నారని అధికారి తెలిపారు. అతనికి ఆలస్యంగా చికిత్స అందించడంతోనే మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారన్నారు. మరోవైపు ఈ విషయంపై జైలు అధికారులు ఇంతవరకు స్పందించలేదు. సీనియర్ ఎస్పీ, జిల్లా మేజిస్ట్రేట్.. సదరు ఖైదీలను శాంతింపజేసే పనిలో నిమగ్నమై ఉన్నారని ఫరూకాబాద్ అదనపు ఎస్పీ అజయ్పాల్ సింగ్ తెలిపారు. మరోవైపు జైళ్లశాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!