కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఇల్లు కూలి ఏడుగురి దుర్మరణం!

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కూలి అందులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.....

Updated : 07 Oct 2021 11:01 IST

బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కూలి అందులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. పురాతన ఇల్లు కావడంతోనే వర్షానికి తడిసిపోయి కూలిపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న సీఎం బసవరాజ బొమ్మై విచారం వ్యక్తం చేశారు. మృతి చెందినవారికి పరిహారం ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చనిపోయినవారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.    


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని