Software Engineer: అమెరికాలో భారత సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోహిత్ఖన్నా (28) మృతి చెందారు. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి చెందిన రోహిత్, మరో ఇద్దరు స్నేహితులతో...
మృతుడు ఐఏఎస్ అధికారి రాజమౌళి మేనల్లుడు
ఈనాడు, అమరావతి: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోహిత్ఖన్నా (28) మృతి చెందారు. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి చెందిన రోహిత్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్కు వెళ్లి తిరిగొస్తుండగా భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోహిత్ఖన్నాతో పాటు కారులో ఉన్న ఇద్దరు గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎ.వి.రాజమౌళికి రోహిత్ఖన్నా మేనల్లుడు. చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ చదివి, తర్వాత అమెరికాలో ఎం.ఎస్. చేసి, డల్లాస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 7న భారతదేశానికి ఆయన రావాల్సి ఉంది. ఈలోపే రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. మృతుడి తల్లిదండ్రులు రాజ్బంధు ఖన్నా, ఉదయలక్ష్మి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!