Crime News: కొలువులిప్పిస్తామని రూ. కోటిన్నర స్వాహా!
మెట్రో, దక్షిణ మధ్య రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి రూ.కోటిన్నర వసూలు చేసిన కాకరపర్తి సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్రెడ్డి(37), దాచిపల్లి సురేష్(33), బానోతు నాగలక్ష్మి(30)లను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు సురేంద్ర, సురేష్
ఈనాడు, హైదరాబాద్: మెట్రో, దక్షిణ మధ్య రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి రూ.కోటిన్నర వసూలు చేసిన కాకరపర్తి సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్రెడ్డి(37), దాచిపల్లి సురేష్(33), బానోతు నాగలక్ష్మి(30)లను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కాకరపర్తి భాగ్యలక్ష్మి(60), ఆలం, శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు. మంగళవారం నేరెడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనరేట్లో నేరవిభాగం డీసీపీ యాదగిరి, మల్కాజిగిరి ఏసీపీ ఎం.శ్యాంప్రసాద్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ జి.నవీన్కుమార్తో కలిసి సీపీ మహేశ్భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడి పేరు కాకరపర్తి సురేంద్ర. ఖమ్మం జిల్లా మధిర స్వస్థలం. పదో తరగతి వరకు చదివి ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. 2012లోనే ఇంగ్లండ్ నుంచి బంగారం బిస్కెట్లు తక్కువ ధరకు తెప్పిస్తానంటూ స్నేహితుల వద్ద రూ.12 లక్షలు వసూలు చేశాడు. 2013లో ఉప్పల్కు వచ్చి క్యాబ్ డ్రైవర్గా అవతారమెత్తాడు. పుట్టా సురేష్రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్కార్డు తెచ్చుకున్నాడు. భార్య నాగలక్ష్మి, సహాయకుడు దాచిపల్లి సురేష్లతో కలిసి మోసాలకు తెరలేపాడు. రైల్వేలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావు, సికింద్రాబాద్కు చెందిన ఆలంతో ప్రచారం చేయించారు. నిరుద్యోగులను రైల్వే నిలయం వద్దకు తీసుకెళ్లి.. ఆలం, శ్రీనివాసరావులను రైల్వే అధికారులుగా పరిచయం చేశారు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.5-10 లక్షలు వసూలు చేశారు. కొందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. నెలల గడుస్తున్నా ఉద్యోగం లేకపోవటంతో బాధితులు ఆరా తీయగా నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్గా తేలింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూత్రధారి సురేంద్ర 60-70 సిమ్కార్డులు ఉపయోగించినట్లు గుర్తించారు. మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ బృందం, మేడిపల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 15-20 మంది నిరుద్యోగుల నుంచి రూ.1.5-2 కోట్ల వరకు వసూలు చేసిన సురేంద్ర నాలుగు కార్లను కొనుగోలు చేసి ఉప్పల్లో ఓం సాయి ట్రావెల్స్, ఓం సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయాలు ప్రారంభించాడు. జడ్చర్ల వద్ద రూ.25 లక్షలతో క్యాంటీన్ ప్రారంభించాడు. బోడుప్పల్ వద్ద తల్లి పేరిట రూ.40 లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే