TS News: విష సర్పంతో వింత చేష్టలు.. ఆసుపత్రి పాలైన వ్యక్తి

విష సర్పంతో ఆటలాడుతూ దాన్ని ముద్దాడి కాటుకు గురైన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్‌ (30).. భార్య, ఇద్దరు పిల్లలతో వలస వచ్చి గాజులరామారం డివిజన్‌ కట్టమైసమ్మ బస్తీలో ఉంటున్నాడు. స్థానిక క్వారీలో రాళ్లు కొడుతుంటాడు.

Updated : 26 Jan 2022 09:20 IST


పామును ముద్దాడుతున్న ఆకాశ్‌

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: విష సర్పంతో ఆటలాడుతూ దాన్ని ముద్దాడి కాటుకు గురైన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్‌ (30).. భార్య, ఇద్దరు పిల్లలతో వలస వచ్చి గాజులరామారం డివిజన్‌ కట్టమైసమ్మ బస్తీలో ఉంటున్నాడు. స్థానిక క్వారీలో రాళ్లు కొడుతుంటాడు. ఆదివారం రాత్రి జనావాసాల మధ్యకు ఓ విష సర్పం రావడంతో పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న ఆకాశ్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అతను పామును చాకచక్యంగా పట్టుకుని మెడలో వేసుకుని దాన్ని ముద్దాడుతూ ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ వింత చేష్టలే అతని ప్రాణాల మీదకు తెచ్చాయి. పామును దూరంగా వదిలిపెట్టిన అనంతరం అతను అస్వస్థతకు గురయ్యాడు. పామును ముద్దాడుతున్న సమయంలో అది కాటు వేసినట్లు అందరూ భావిస్తున్నారు. వెంటనే అతన్ని సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని