Crime News: ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణం!
అమీన్పూర్ పట్టణంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు అత్మహత్యకు కారణాలు అంతు చిక్కడం లేదు. గురువారం మృతదేహాలను పోలీసులు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి
వివరాల సేకరణలో తలమునకలైన పోలీసులు
కుటుంబం బలవన్మరణం.. వీడని మిస్టరీ
శ్రీకాంత్గౌడ్, అనామిక, శ్రీస్నిగ్ధ
అమీన్పూర్, న్యూస్టుడే: అమీన్పూర్ పట్టణంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు అత్మహత్యకు కారణాలు అంతు చిక్కడం లేదు. గురువారం మృతదేహాలను పోలీసులు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు మృతదేహాలను శామీర్పేట మండలం తూంకుంట పట్టణం పోతాయ్పల్లికి తీసుకువెళ్లారు. శుక్రవారం 11గంటలకు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి మృతదేహాలను తరలించే సమయంలో పోలీసులు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని క్లూస్టీంకు అప్పగించారు. ఆ రెండు ఫోన్లు పూర్తిగా ఫార్మాట్ చేసి ఉన్నాయి. ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా.. అధ్యాత్మికపరంగా ఏమైనా విశ్వాసాలున్నాయా.. ఆర్థిక పరమైన ఇబ్బందుల కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
పథకం ప్రకారమే..
శ్రీకాంత్గౌడ్ కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకునేందుకు ముందుగానే పథకం వేసుకున్నాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. వాళ్ల ఇంటి పనిమనిషికి మంగళవారం సాయంత్రం శ్రీకాంత్ ఫోన్ చేసి.. మేము ఊరికి వెళ్తున్నాం, రెండు రోజుల తరువాత వస్తాం, మళ్లీ ఫోన్ చేసే వరకు రావద్దని చెప్పాడు. పాలు పోసే వ్యక్తికి కూడా అదే రోజు ఫోన్ చేసి చెప్పాడు.
సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు
శ్రీకాంత్గౌడ్ ఆత్మహత్యకు ముందే అతని ఫోన్, భార్య అనామిక ఫోన్లను పూర్తిగా ఫార్మాట్ చేశాడు. అతని ల్యాప్టాప్లో ఉన్న సమాచారం కూడా పూర్తిగా తొలగించాడు. ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్లో ఉండే హిస్టరీని కూడా తొలగించాడు. ఫోన్లో ఉండే సిమ్కార్డును కూడా తొలగించి కనిపించకుండా చేశాడు. ఫోన్లలో డేటా లేకపోవడంతో విచారణ పోలీసులకు ఇబ్బందిగా మారింది. నిపుణుల సహకారంతో డేటాను సేకరించే పనిలో ఉన్నారు. ఇంట్లో ఉన్న ఫొటోలు బోర్లా పడిఉండటం, మృతి చెందిన వారి ముఖాలపై పెద్ద తిలకం బొట్టు ఉండటంతో, పోలీసులు వీరికి ఆధ్యాత్మికంగా ఏమైనా నమ్మకాలున్నాయా.. అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. కొందరు.. కుటుంబీకులు ఎవరైనా మరణిస్తే ఇంట్లో దేవుడి చిత్ర పటాలను తిరగేసి ఉంచుతారని తెలుసుకున్నారు.
రుణ భారంతోనే..
శ్రీకాంత్ గౌడ్ కుటుంబం సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక పరమైన అంశాలే కావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంటి కొనుగోలుకు బజాజ్ ఫైనాన్స్లో రూ.30లక్షల హౌసింగ్ రుణం తీసుకున్నాడు. ఇంటిపై అంతస్తు నిర్మాణం సమయంలో రూ.11లక్షల టాప్అప్ రుణం తీసుకున్నాడు. మరో రూ.7లక్షల వ్యక్తిగత రుణం కూడా తీసుకున్నట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ