Crime News: ఇన్నోవాలో వచ్చి పోలీసులమంటూ బెదిరిస్తారు.. గొర్రెలన్నీ ఎత్తుకెళ్తారు!
తెల్లవారుజామున ఇన్నోవాలో తిరుగుతూ జాతీయ రహదారిపై కాపు కాస్తారు. గొర్రెలను తీసుకొని మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్న వాహనాలనే లక్ష్యంగా..
సంగారెడ్డి: తెల్లవారుజామున ఇన్నోవాలో తిరుగుతూ జాతీయ రహదారిపై కాపు కాస్తారు. గొర్రెలను తీసుకొని మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుంటారు. వాహనాన్ని అడ్డుకుని, గొర్రెలను ఎక్కడకు తీసుకెళ్తున్నారు? అన్ని రకాల పత్రాలున్నాయా? అంటూ హడావుడి చేస్తారు. వాహనంలోని వారిని ఇన్నోవాలో ఎక్కించుకొని బెదిరించి ఉన్నదంతా దోచుకొని రోడ్డుపై విడిచిపెడతారు. ఈలోగా మిగతా ముఠా సభ్యులు గొర్రెలను వేరే వాహనంలో తరలించి అమ్మేస్తారు. ఇదీ 52 కేసులున్న ఖాజా వహబుద్దీన్ ముఠా నేరాలు చేసే తీరు. ముఠా గుట్టు లాగిన తీరుపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఖాజా వహబుద్దీన్ (45) ఆరుగురితో ముఠాను ఏర్పాటు చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి పిస్టోల్, బుల్లెట్లను కొనుగోలు చేశాడు. గత నెల 8న మహారాష్ట్రకు చెందిన మహదేవ్ బీరూ గోడ్కే తన బొలెరోలో గొర్రెలను జియాగూడ మార్కెట్కు తీసుకెళ్తున్నారు. తెల్లవారుజామున ఇన్నోవాలో వచ్చిన వహబుద్దీన్ ముఠా సభ్యులు వాహనాన్ని ఆపి బెదిరించి గొర్రెలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ నెల 13న మహారాష్ట్రకు చెందిన షేక్ తస్లీం దేశ్ముఖ్ తన డ్రైవర్ కిషన్ భజరంగ్, మరో వ్యక్తి హనుమాన్తో కలిసి గొర్రెలను జియాగూడ మార్కెట్కు తరలిస్తున్నారు. పటాన్చెరు మండలం రుద్రారంవద్ద ఇన్నోవాలో వచ్చి బాధితుల వద్ద రూ.7వేలు, సెల్ఫోన్లు లాక్కొన్నారు. వీటిపై పోలీసులు దృష్టి సారించి... ఖాజా వహబుద్దీన్తోపాటు అతడికి సహకరించిన మహ్మద్ తాజుద్దీన్ (27), మహ్మద్ ఇసాక్ (33), మహ్మద్ అనీఫ్ (35)లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక పిస్టోలు, రెండు కత్తులు, ఏడు బుల్లెట్లు, రూ.1.51లక్షల నగదు, రూ.3.20లక్షల విలువ చేసే 60 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. ఖాజా వహబుద్దీన్పై ఇప్పటికే 52 కేసులు నమోదయ్యాయి. ముఠాకు సహకరించిన తైమూరు, అమీర్, షేక్ ఇమ్రాన్లు పరారీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM