Crime News: విమానాల్లో వస్తారు.. ఏటీఎంలు దోచేస్తారు
ఆరుగురు సభ్యుల ముఠా.. అందరిది హరియాణా.. విమానాల్లో దేశమంతా తిరుగుతారు.. కేవలం ఒకే కంపెనీ ఏటీఎంలు దోచుకెళ్తారు. డిజిటల్ కీల సాయంతో కొన్నేళ్లుగా ఏటీఎంల్లో దోపిడీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
హరియాణా ముఠా అరెస్టు
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్టుడే: ఆరుగురు సభ్యుల ముఠా.. అందరిది హరియాణా.. విమానాల్లో దేశమంతా తిరుగుతారు.. కేవలం ఒకే కంపెనీ ఏటీఎంలు దోచుకెళ్తారు. డిజిటల్ కీల సాయంతో కొన్నేళ్లుగా ఏటీఎంల్లో దోపిడీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ ఎస్బీఐ ఏటీఎంలో ఈ నెల 16న రాత్రి 7.30కు ఓ అనుమానిత లావాదేవీ జరిగింది. అప్పటికే సీసీ కెమెరాల ద్వారా విషయాన్ని గుర్తించిన బ్యాంకు సిబ్బంది మేనేజర్కు తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలో దిగి కేంద్రాన్ని పరిశీలించారు. అరగంట వ్యవధిలో డిజిటల్ కీ సాయంతో రూ.30 వేలు నగదు డ్రా చేసి తప్పించుకొన్నట్లు గుర్తించారు. సీసీ టీవీ దృశ్యాల సాయంతో రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు బస చేసినట్లు తెలియడంతో తనిఖీలు చేశారు. ఎట్టకేలకు నిందితులు మహమ్మాద్ అల్తాబ్, వకీల్ అహ్మద్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వారి నుంచి రూ.30 వేల నగదు, రెండు చరవాణులు, రెండు ఏటీఎం మానిటర్ డిజిటల్ కీలు, వివిధ బ్యాంకులకు చెందిన 11 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకొన్నట్లు ఏసీపీ తెలిపారు.
నగదు విత్డ్రా సమయంలో..
హరియాణాలోని పాల్వాల్ జిల్లాకు చెందిన షాకీర్ ఆధ్వర్యంలో అల్తాబ్, వకీల్ అహ్మద్, అమీర్ సోహెల్, ఆషిక్, ఇన్సాఫ్ ఓ ముఠాగా ఏర్పడి హ్యోసంగ్ కంపెనీ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేస్తున్నారు. తొలుత ఒక రాష్ట్రాన్ని ఎంచుకున్నాక విమానంలో అక్కడికి వెళ్తారు. చోరీకి అనుకూలంగా ఉన్న ఏటీఎం కేంద్రాన్ని గుర్తించి సమీపంలోని లాడ్జిల్లో దిగుతారు. రాత్రివేళల్లో సీసీ కెమెరాలకు చిక్కకుండా బయటికొస్తారు. వారి దగ్గర ఉన్న డెబిట్ కార్డులతో నగదు విత్డ్రా చేస్తారు. సరిగ్గా యంత్రంలో నుంచి నగదు వచ్చే సమయంలో డిజిటల్ కీల సాయంతో సెన్సార్ పనిచేయకుండా చూసుకుంటారు. దీంతో డబ్బులు విత్డ్రా జరిగినా ఖాతాలో చూపించదు. ఇలా వివిధ కార్డులతో రూ.లక్షల్లో నగదు తీసుకొని ఆ రాష్ట్రం నుంచి ఉడాయిస్తారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్హెచ్వో ఆంజనేయులు, ఎస్సై నర్సింలు, సిబ్బంది నర్సింగ్రావు, రహీం, శ్రీనివాస్ బృందాన్ని ఏసీపీ అభినందించారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డెబిట్కార్డులు, డిజిటల్ కీలు, చరవాణిలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!