వారి నుంచి వజ్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ 

ముంబైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 2 బిలియన్‌ డాలర్లకు పైగా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సీలకు సంబంధించిన 2,300 కిలోల..

Updated : 11 Jun 2020 05:25 IST

దిల్లీ: ముంబైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు 2 బిలియన్‌ డాలర్లకు పైగా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సీలకు సంబంధించిన 2,300 కిలోల సానబెట్టిన వజ్రాలు, ముత్యాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హాంకాంగ్‌లో స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.1,350 కోట్లు ఉంటుందని ఈడీ తెలిపింది. హాంకాంగ్‌లో స్వాధీనం చేసుకున్న విలువైన వజ్రాలు, ముత్యాలు, వెండి ఆభరణాలను అన్ని రకాల న్యాయపరమైన లాంఛనాలను పూర్తి చేసుకొని బుధవారం వాటిని భారత్‌కు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్ చట్టం కింద వాటిని సీజ్‌ చేస్తున్నట్లు  వెల్లడించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని