50 కాకులు, 3 కుక్కలు మృతి

తమిళనాడు, నాగపట్టణం జిల్లా పూంపుహార్‌లో గురువారం మూడు కుక్కలు, 50 కాకులు మృతి చెందాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వీటి మృతితో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Updated : 24 Apr 2020 07:05 IST

నమూనాలు సేకరించిన పశుసంవర్ధక అధికారులు

 చెన్నై: తమిళనాడు, నాగపట్టణం జిల్లా పూంపుహార్‌లో గురువారం మూడు కుక్కలు, 50 కాకులు మృతి చెందాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వీటి మృతితో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పశుసంవర్ధక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని కుక్కలు, కాకుల కళేబరాల నుంచి నమూనాలను సేకరించారు. పరీక్షించిన అనంతరం వాటి మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని