వీడియోకాల్లోనే భర్త అంత్యక్రియలు
లాక్డౌన్ కారణంగా భర్త అంత్యక్రియలకు భార్య హాజరుకాలేకపోయింది. రవాణా వ్యవస్థ లేకపోవడంతో కడసారి చూపులకు నోచుకోలేకపోయింది. వీడియోకాల్లోనే అంతిమ సంస్కారాలు వీక్షిస్తూ...
ముంబయి: లాక్డౌన్ కారణంగా భర్త అంత్యక్రియలకు భార్య హాజరుకాలేకపోయింది. రవాణా సదుపాయం లేకపోవడంతో కడసారి చూపులకు నోచుకోలేకపోయింది. వీడియోకాల్లోనే అంతిమ సంస్కారాలు వీక్షిస్తూ ఆమె కన్నీరు మున్నీరయ్యింది. మహారాష్ట్రలో జరిగిన ఈ హృదయవిదారకర సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంతి బందేకర్, చంద్రకాంత్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని మోర్లె గ్రామంలో నివాసం ఉండేవారు. అయితే చంద్రకాంత్ మార్చి 22న ముంబయిలో ఉంటున్న తన కుమారుడు అమిత్ దగ్గరికి వెళ్లాడు.
అయితే చంద్రకాంత్ అనారోగ్యంగా ఉండటంతో అమిత్ ఆసుప్రతికి తీసుకెళ్లాడు. అతడు క్యాన్సర్ చివరి దశలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. తన తల్లి స్వస్థలంలో ఉండటంతో ఈ విషయాన్ని ఆమెకి చెప్పలేదు. అనారోగ్యంతో చంద్రకాంత్ ఏప్రిల్ 16న మరణించాడు. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సదుపాయం లేకపోవడంతో 490 కి.మీ. దూరంలో ఉన్న సొంతూరుకి తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లలేకపోయానని, అలాగే తల్లిని ముంబయికి రప్పించలేకపోయానని అమిత్ వాపోయాడు. దీంతో వీడియోకాల్లోనే అంతిమ సంస్కారాలు చూసేందుకు ఏర్పాట్లు చేశానని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్