విమానం కూలి.. ఐఏఎఫ్‌ పైలట్‌ మృతి..!

పంజాబ్‌లోని పటియాలాలో సోమవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పటియాలా ఏవియేషన్‌ క్లబ్‌కు చెందిన మైక్రోలైట్‌ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్‌ కమాండర్‌ దుర్మరణం పాలయ్యారు.

Published : 25 Feb 2020 00:49 IST

పటియాలా: పంజాబ్‌లోని పటియాలాలో సోమవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పటియాలా ఏవియేషన్‌ క్లబ్‌కు చెందిన మైక్రోలైట్‌ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్‌ కమాండర్‌ దుర్మరణం పాలయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాటియాలాలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏవియేషన్‌ క్లబ్‌కు చెందిన మైక్రో లైట్‌ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 3వ ఎయిర్‌ స్క్వాడ్రన్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ చీమ గుర్‌ప్రీత్‌సింగ్‌ మరణించారు. ఎన్‌సీసీ క్యాడెట్‌ విపిన్‌కుమార్‌ యాదవ్‌ గాయాల పాలయ్యారు. ఈ మైక్రో లైట్‌ విమానాల్ని ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్షణ కోసం ఉపయోగిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని