తల్లిని చంపి ప్రియుడితో అండమాన్కు..!
బెంగళూరు: కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్యచేసి ప్రియుడితో పరారైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంతేకాదు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రియుడితో కలిసి అండమాన్కి పరారయ్యింది. కూతురే కన్న తల్లిని చంపడం అరుదైన ఘటన అని..మేం కూడా జీర్ణించుకోలేకపోతున్నామని బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు
బెంగళూరులో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘాతుకం
బెంగళూరు: కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్యచేసి ప్రియుడితో పరారైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంతేకాదు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రియుడితో కలిసి అండమాన్కు పరారైంది. పక్కా పథకం ప్రకారమే అమృత ఈ హత్య చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల పాటు గాలించిన అనంతరం పోలీసులు అమృతతో పాటు ప్రియుడు శ్రీధర్ రావుని అండమాన్లో అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమృత(33) సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. 2017 వరకు రెగ్యులర్గా పనిచేసిన అమృత, కుటుంబ సమస్యలతో ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచే తాత్కాలికంగా పనిచేస్తోంది. అయితే పోలీసులు విచారణలో మాత్రం అమృత తన కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపిందన్నారు.
తండ్రి ఊపిరితిత్తుల కాన్సర్ కారణంగా అమృత కుటుంబం అప్పల్లో కూరుకుపోయింది. వీటన్నింటినుంచి బయటపడేందుకు తన తల్లి, సోదరుడిని హత్య చేసి చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆమె భావించింది. ఫిబ్రవరి 2వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అమృత తన తల్లి నిర్మల(52)ను వంటిట్లో ఉన్న చాకుతో దారుణంగా పొడిచింది. ఆ సమయంలో అలజడికి నిద్రలేచి వచ్చిన సోదరుడిని కూడా అదే కత్తితో పొడిచింది. అనంతరం తల్లీ, సోదరుడు చనిపోయారని భావించి తన బ్యాగుతో బయటకు వెళ్ళింది. అప్పటికే ఇంటి బయట బైక్పై సిద్ధంగా ఉన్న ప్రియుడు శ్రీధర్రావుతో కలిసి నేరుగా ఎయిర్పోర్టుకు చేరుకొంది. ఆ బైక్ను అక్కడే వదిలేసి..ముందుగానే బుక్ చేసుకున్న విమానంలో పోర్ట్బ్లెయిర్కు పారిపోయారు. అక్కడే ఐదు రోజులపాటు గడిపేవిధంగా వీరు ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఈ దాడిలో అమృత తల్లి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన ఆమె సోదరుడు సమీపంలో ఉండే తమ బంధువులకు ఫోన్ చేసి ప్రాణాలు దక్కించుకొన్నాడు.
తన ప్రియుడికి ముందుగానే ఇచ్చిన మాట ప్రకారం అండమాన్కు వెళ్ళానని అమృత పోలీసులకు చెప్పడం గమనార్హం. అయితే అమృత హత్య ప్లాన్ తన ప్రియుడికి తెలుసా? లేదా? అనే విషయం ఇంకా తేలలేదని పోలీసులు పేర్కొన్నారు. పోలీసు విచారణలో అమృత చెప్పిన విషయాలు ఇలా ఉండగా.. ఇవే కచ్చితమైన కారణాలు కాకపోవచ్చని..మానసిక కారణాలు ఏవైనా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరిని బెంగళూరుకు తీసుకొచ్చిన విచారించిన అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ