డాల్ఫిన్పై దాడి.. ముగ్గురి అరెస్టు..!
అనుకోకుండా కాలువలోకి కొట్టుకొచ్చిన ఓ డాల్ఫిన్ను కిరాతకంగా కొట్టి చంపడంతో ముగ్గురిని అరెస్టు చేసిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ప్రతాప్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ కాలువలోకి డిసెంబర్ 31న డాల్ఫిన్ వచ్చింది. దీంతో అక్కడి ఆకతాయి గుంపు ఆ డాల్ఫిన్పై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు...
లఖ్నవూ: అనుకోకుండా కాలువలోకి కొట్టుకొచ్చిన ఓ డాల్ఫిన్ను కొందరు ఆకతాయిలు కిరాతకంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనికి కారణమైన వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ కాలువలోకి డిసెంబర్ 31న డాల్ఫిన్ వచ్చింది. దీంతో అక్కడున్న కొందరు ఆకతాయిలు దానిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. వర్షం పడుతున్నా వదలకుండా రక్తం వచ్చేలా కొట్టారు.
ఈ క్రమంలో ఓ నిందితుడు డాల్ఫిన్పై గొడ్డలితో దాడి చేసి ఇనుప రాడ్డును శరీరంలోకి దించాడు. దీంతో అది ప్రాణాలు కోల్పోయింది. కారణం లేకుండానే వారు డాల్ఫిన్పై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ‘కాలువ పక్కన డాల్ఫిన్ ప్రాణం లేకుండా పడి ఉండటం గమనించాం. దీంతో స్థానికులను ప్రశ్నించగా ఎవరు చంపారో తెలియదని సమాధానం ఇచ్చారు. డాల్ఫిన్ శరీరంలో గాయాలు, గొడ్డలి పోట్లను గమనించిన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’ అని అటవీ శాఖ అధికారి చెప్పారు. డాల్ఫిన్పై దాడి చేసి చంపిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇవీ చదవండి..
అలాచేస్తే లక్షల కరోనా కేసులను ఆపవచ్చు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్