డాల్ఫిన్‌పై దాడి.. ముగ్గురి అరెస్టు..!

 అనుకోకుండా కాలువలోకి  కొట్టుకొచ్చిన  ఓ డాల్ఫిన్‌ను కిరాతకంగా కొట్టి చంపడంతో ముగ్గురిని అరెస్టు చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ కాలువలోకి డిసెంబర్‌ 31న డాల్ఫిన్‌ వచ్చింది. దీంతో అక్కడి ఆకతాయి గుంపు ఆ డాల్ఫిన్‌పై  కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు...

Published : 09 Jan 2021 00:44 IST

లఖ్‌నవూ: అనుకోకుండా కాలువలోకి కొట్టుకొచ్చిన ఓ డాల్ఫిన్‌ను కొందరు ఆకతాయిలు కిరాతకంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. దీనికి కారణమైన వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ కాలువలోకి డిసెంబర్‌ 31న డాల్ఫిన్‌ వచ్చింది. దీంతో అక్కడున్న కొందరు ఆకతాయిలు దానిపై  కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. వర్షం పడుతున్నా వదలకుండా రక్తం వచ్చేలా కొట్టారు. 

 ఈ క్రమంలో ఓ నిందితుడు డాల్ఫిన్‌పై గొడ్డలితో దాడి చేసి ఇనుప రాడ్డును శరీరంలోకి దించాడు. దీంతో అది ప్రాణాలు కోల్పోయింది. కారణం లేకుండానే వారు డాల్ఫిన్‌పై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ‘కాలువ పక్కన డాల్ఫిన్ ప్రాణం లేకుండా పడి ఉండటం గమనించాం. దీంతో స్థానికులను ప్రశ్నించగా ఎవరు చంపారో తెలియదని సమాధానం ఇచ్చారు.  డాల్ఫిన్ శరీరంలో గాయాలు, గొడ్డలి పోట్లను గమనించిన అనంతరం ఎఫ్ఐఆర్‌ నమోదు చేశాం’ అని అటవీ శాఖ అధికారి చెప్పారు.  డాల్ఫిన్‌పై దాడి చేసి చంపిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి..

అలాచేస్తే లక్షల కరోనా కేసులను ఆపవచ్చు!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని