మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లి మృత్యు ఒడికి
మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంజీరా నదిలో పడి రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన కామారెడ్డి
మంజీరా నదిలో పడి నలుగురు మృతి
బీర్కూర్: మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంజీరా నదిలో పడి రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామానికి చెందిన గంగారాం, మారుతి ఇద్దరు అన్నదమ్ములు. గంగారాం భార్య అంజవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీర్కూర్లోని గైపీర్ల దర్గాలో మొక్కు చెల్లించాలని అంజవ్వ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన చిన్న కుమార్తె సోని (17)ని తీసుకుని శుక్రవారం ఉదయం 11 గంటలకు దర్గాకు బయలుదేరింది. వారిని చూసిన మారుతి పిల్లలు గంగోత్రి (11), ప్రశాంత్ (7) కూడా వారితో కలిసి దర్గా వద్దకు వెళ్లారు.
మార్గమధ్యంలో వారందరూ బీర్కూరు-షెట్లూరు గ్రామాల మధ్యలో ఉన్న మంజీరా నది వద్దకు చేరుకున్నారు. నీటి ప్రవాహం తక్కువగా ఉందని భావించి నది దాటే ప్రయత్నం చేశారు. నది దాటే క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురూ మంజీరా నదిలో చిక్కుకుపోయారు. రాత్రి కావస్తోన్నా వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేసినా స్పందన లేదు. వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం నదిలో ముగ్గురి మృతదేహాలు కొట్టకురావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంజవ్వ, సోని, ప్రశాంత్ మృతదేహాలుగా గుర్తించారు. అనంతరం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా గంగోత్రి మృతదేహం కూడా లభ్యమైంది. ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
టీఎస్ ఎండీసీ ఆధ్యర్యంలో ఏడాది కాలంగా నది పరిసరాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. తమ పిల్లలను ఇసుక గుంతలే బలితీసుకున్నాయని మృతుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ జైపాల్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, సీఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. తమ పిల్లల మృతికి కారకులైన క్వారీ నిర్వాహకులు పరిహారం చెల్లించేదాకా మృతదేహాలను తీసేది లేదని ఘటనా స్థలంలోనే బైఠాయించారు. చివరకి పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాలను బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు. కేసు నమెదు చేసి దర్వాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు