Hyderabad : హైదరాబాద్లో మాదకద్రవ్యాలు.. టోనీకి 5 రోజుల కస్టడీ
మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు నైజీరియాకు చెందిన టోనీని నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ నెల 20న టోనిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా.. మరో 10 మంది నిందితులు...
హైదరాబాద్ : మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు నైజీరియాకు చెందిన టోనీని నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ నెల 20న టోనిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా.. మరో 10 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. శశికాంత్, గజేంద్రప్రకాశ్, సంజయ్, అలోక్ జైన్, ఆసిఫ్, షాహిద్, అఫ్తాబ్, రహమత్, ఇర్ఫాన్, ఫిర్దోస్పై అభియోగాలు మోపారు.
మరోవైపు రిమాండ్ రిపోర్టు వివరాలను పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు టోనీ 2019 నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. 2013లో టోనీ 3 నెలల పర్యటన వీసాపై భారత్కు వచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రారంభంలో విగ్గులు, వస్త్రాలు నైజీరియాకు ఎగుమతి చేసిన టోనీ.. డబ్బులు సరిపోకపోవడంతో డ్రగ్స్ సరఫరాను ఎంచుకున్నాడు. భారత్లోనే నైజీరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అంధేరీలో కాపురం పెట్టాడు. నైజీరియాకు చెందిన స్టార్ బాయ్ ఓడల ద్వారా ముంబయికి డ్రగ్స్ చేరవేసే వాడు. స్టార్ హోటళ్లు, ఈవెంట్లకు వెళ్లి, పరిచయాలు పెంచుకొని క్రమంగా ముంబయి, గోవా, హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయాలు సాగించాడు. తన దగ్గర 13 మంది డ్రగ్స్ కొన్నట్లు పోలీసులకు టోనీ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. -
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!